తమ ప్రభుత్వం ఒక్క దెబ్బతో దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని, ఉగ్రవాదాన్ని, అంతర్గత తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు చర్యలు తీసుకుందని దీంతో ఇక దేశం డిజిటల్ క్యాష్ దిశగా పయనిస్తుందని, ఇది క్యాష్ లెస్ ఎకానమికి దోహదపడి త్వరలోనే అ ఫలితాలను అందుకున్న తొలి దేశంగా కూడా నిలుస్లుందని ఓ వైపు కేంద్రం ప్రభుత్వంలోని పెద్దలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో తాము కష్టపడి, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన డబ్బును పొందేందుకు అవస్థలు పడుతున్నామని దేశంలోని ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా వాటిని కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రంతో ఏ సంబంధం లేని, కనీసం ప్రభుత్వాంలో పరోక్ష సంబంధం కూడా లేని వ్యక్తులకు, బడా బిజినెస్ మెన్లకు, బీజేపి స్పాన్సర్లకు ముందుకుగానే లీకులు ఇచ్చారన అరోపణలు వస్తున్నా.. ఇప్పటి వరకు కేంద్రం ప్రభుత్వంలోని ఏ ఒక్కరైనా ఆ ఆరోపణలపై స్పందించారా..? అంటే లేదు అన్న సమాధానమే వస్తుంది. బాబా రాందేవ్ వద్దని అంటే పది వేల నోటు ముద్రణను ప్రభుత్వం రద్దు చేసుకుందంటే.. కేంద్రంలో వున్నది ప్రజా ప్రభుత్వమా..? లేక సన్యాసులు, సంపన్నులు, పారిశ్రామిక వేత్తల, బడాబాబుల ప్రభుత్వమా..? అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ తరుణంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ తమ్ముడు ప్రహల్లాద్ మోడీ తన అన్న ప్రభుత్వం పట్ల ప్రహ్లాద భక్తిని చాటుకున్నారు. విమర్శలు విని విని అలవాటు అయినట్లుంది కాబోలు.. అసలు వాటి జోలికే వెల్లకుండా.. మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతవరకు బాగానే వున్నా అయన స్వాగతించిన తీరు చూసి హైదరాబాద్ వాసులు కంగుతిన్నారు. హైదరాబాద్ ప్రజలపై నగదు కొరత ఉన్నట్లు తనకు అనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
నగరంలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడా నగదు సమస్య ఉన్నట్లు లేదని, ఎవరి ముఖాలు చూసినా ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనపడుతున్నారని, దీనిని బట్టే తాను ఇలా అనుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే ఆయన దారిలో మూసివున్న ఏటీయం కేంద్రాలు, ఇవాళ తెరుచుకోని బ్యాంకులు గురించి తెలియదు కాబోలు అందుకనే అలా స్టేట్ మెంట్ ఇచ్చారని పురజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more