అవినీతి, నల్లధనంపై యుద్దాన్ని ప్రకటించిన కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది .పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో దాఖలైన పిటీషన్లను విచారించకుండా అదేశాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దేశంలోని వివిధ కోర్టుల్లో దాఖలైన అన్ని కేసును ఒకే చోట విచారించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టు అదేశాలిచ్చిన నేపథ్యంలో దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రస్తుతం పరిస్థితి చాలా వరకూ మెరుగుపడిందని, బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు తగ్గాయని, ఆన్లైన్లో నగదు వినియోగం బాగా పెరిగిందని అందువల్ల హైకోర్టుల్లో కేసుల విచారణపై స్టే విధించాలన్న కేంద్రం వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేవలం క్యూ లైన్లు, నదగు నిల్వల మాత్రమే కాదు.. దాఖలైన పలు పిటీషన్లలో అనేక అంశాలు పొందుపచ్చబడ్డాయని పేర్కోంది. వీటిపై ప్రజలు హైకోర్టుల నుంచి తక్షణ ఉపశమనం పొందుతారు’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్ పేర్కొంది.
అవినీతిని కట్టడి చేసి నల్లధన కుబేరుల నుంచి పన్ను వసూలు చేయడంతో పాటు నకిలీ కరెన్సీ ఏరివేతకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు విజయవంతమైందని, అప్పుడే ఈ నిర్ణయానికి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడుతున్నాయని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకూ రూ. 6 లక్షల కోట్లు డిపాజిట్లు వచ్చాయని, డిసెంబర్ చివరికి ఈ మొత్తం రూ. 10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. కాగా కేంద్రం వాదనలతో కోర్టు సంతృప్తి చెందకపోవడంతో కేసు తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more