మూడేళ్ల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీకి అత్యంత కావాల్సిన వ్యక్తి. ఆయన ఆ పార్టీకి ముందు పెట్టిన అన్ని డిమాండ్లను అంగీకరించిడంతో పాటు పార్టీ విడుదల చేసిన మానిఫెస్టోలో కూడా ఆయన డిమాండ్లను ప్రస్తావించారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడం.. డిమాండ్లను నెరవేర్చాలని పట్టుబట్టడంతో ఆయన ప్రభుత్వానికి శత్రువుగా మారారు. ఎంతలా అంటే ఆయన చేస్తున్న పాదయాత్రను కూడా జీర్ణంచుకోలేని ప్రభుత్వం ఆయనను ఏకంగా నాలుగు రోజులుగా గృహనిర్భందంలో వుంచింది. ఆయన మరెవరో కాదు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.
ప్రస్తుతం ముద్రడగ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఆయనను తన నివాసంలో నుంచి బయటకు రానీయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక అటు బయట వ్యక్తులు కూడా ఇంట్లోకి రాకుండా అంక్షలు విధించారు, దీంతో పాటు క్లిరంపుడి సహా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పోలీసులు ఇచ్చిన 48 గంటలు గడువు ముగిసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ముద్రగడ నివాసం వద్ద ప్రతి కదలికను పోలీసులు బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పోలీసుల నుంచి తనకు స్వేచ్ఛ కలిగినప్పుడే జేఏసీతో చర్చించి సత్యాగ్రహ యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నిరోజులు ఇంట్లో ఉండమంటే అన్ని రోజులూ ఉంటానని, పోలీసులు వెళ్లిపోయి తనకు స్వేచ్ఛ ఇస్తే పాదయాత్ర చేపడతానని అన్నారు, పోలీసులు వెనక్కు వెళ్లిపోతే పాదయాత్ర తేదీలు ప్రకటిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.
మరోవైపు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, వాసురెడ్డి ఏసుదాసు ,కల్వకొలను తాతాజీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కాగా రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్రకు సిద్ధమయిన ముద్రగడ సహా పలువురు కాపు జేఏసీ నేతలను మంగళవారం ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more