అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్దాన్ని ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా.. నోట్ల మార్పు కోసం.. అనేక మంది బ్యాంకుల వద్ద, డబ్బులు డ్రా చేసుకునేందుకు విధించిన పరిమితులతో పలువరు ఏటీయం కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో వారిలో అనేక సందేహాలు, అనుమాలను వ్యక్తం చేస్తూ పక్కవారితో చర్చోపచర్చలు పెడుతున్నారు. వారి మదిని తొలుస్తున్న అనేక సందేహాలలో ముఖ్యంగా ఏటీయం కేంద్రాలలో వున్న డబ్బు డ్రా చేసే పరిమితి.. వాటిపై వేసే చార్జీల అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
రోజుకు రెండున్నర వేల రూపాయలను మాత్రమే డ్రా చేసుకునే అవకాశం వుండటంతో తమకు మూడు సార్లు మాత్రమే ఖాతా వున్న బ్యాంకు ఏటీయంలో, ఆ తరువాత రెండు పర్యాయాలు ఇతర బ్యాంకు ఏటీయంలలో డబ్బును డ్రా చేసుకునే అవకాశం వుందని, ఈ నేపథ్యంలో ఐదు పర్యాయాలు దాటినా.. తరువాత తాము విత్ డ్రా చేసుకునే డబ్బుపై ఏటీయం చార్జీలు కూడా కలవర పెట్టాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై డిసెంబరు 30 వరకు ఎటువంటి చార్జీలను వసూలు చేసేది లేదని ప్రకటించింది. అయితే ఇది సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, డెబిట్ కార్డులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. తమ బ్యాంకులతోపాటు ఇతర బ్యాంకుల్లో నెలలో ఎన్నిసార్లు అయినా లావాదేవీలు చేసుకోవచ్చని, పరిమితి లేదని, చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.
ప్రస్తుతం సొంతబ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదుసార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నెలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో డెబిట్ కార్డును పలుమార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more