ఒకరు వేల కోట్లు ఎగొట్టి మరీ విదేశాలో తలదాచుకుంటున్న జల్సా రాయుడు. మరోకరేమో వివాదాస్పద ఉపన్యాసాలతో ఉగ్రవాదాన్ని ప్రొత్సహించాడన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఇద్దరూ భారత దేశము నా మాతృభూమి అని చదువుకున్న వారే కానీ, ఇప్పుడు భారత్ పేరు చెబితేనే అరెస్ట్ చేస్తారనే భయంతో వణికిపోతున్నారు. ఒకరు లిక్కర్ లింక్ (మాజీ?) విజయ్ మాల్యా, మరోకరు పీస్ టీవీ చానెల్ అధినేత జకీర్ నాయక్.
భారత్ లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో... వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఆఖరికి తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (88) ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన డాక్టర్ అబ్దుల్ కరీం మంచి వైద్యుడిగా, విద్యావేత్తగా పేరొందాడు. నిన్న తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయనేతలు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు హాజరయ్యారు. అయినప్పటికీ, జకీర్ నాయక్ మాత్రం రాలేదు. జకీర్ వస్తాడనే అంచనాతో జాతీయ నిఘా సంస్థ అధికారులు, స్థానిక పోలీసలు, సిటీ క్రైం పోలీసులు అంత్యక్రియలు జరిగే ప్రాంతం చూట్టూ గాలిస్తూనే ఉన్నారు.
ఇక భారతీయ బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయన దీపావళి పండుకకు భారత్లోని తన స్నేహితులకు భారీ బహుమతులు పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. యూబీ గ్రూప్ లోగోతో కూడిన అందమైన బాక్సులో ఖరీదైన బ్లాక్ లేబుల్ మద్యం బాటిల్ను భారత్కు పార్శిల్స్ చేశాడు. మాల్యా పంపిన ఈ బహుమతులు దేశంలోని పలువురికి అందినట్టు సమాచారం. ఎన్నిసార్లు కోర్టులు ఆదేశించినా భారత్కు రావడానికి మాల్యా సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదన్న సంగతి తెలిసిందే. గతంలో తను సారథ్యం వహించిన యునైటెడ్ బ్రూవరీస్ కు చెందిన మద్యం బాటిళ్లను గిఫ్ట్ రూపంలో మాల్యా పంపిస్తున్నాడంటూ ఓ జర్నలిస్ట్ బయటపెట్టడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more