దీపావళి పర్వదినాన ఆ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. దేశానికి చెందిన సుమారు ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తూ కస్టమర్లకు షాకిచ్చిన దేశీయ అగ్రశ్రేణి బ్యాంకు ఎస్బీఐ, వారికి పండుగ రోజున శుభవార్తను అందించింది. వారి డిబిట్ కార్డులను బ్లాక్ చేసిన నేపథ్యంలో వారికి కొత్త కార్డులను జారీ చేస్తోంది. ఇటీవలే హితాచీ పేమెంట్స్ సర్వీసెస్లో మాల్వేర్ ఇనెక్షన్ వల్ల దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల తస్కరణకు గురైన సంగతి తెలిసిందే.
ఇదివరకెప్పుడూ కనివినీ ఎరుగని విధంగా జరిగిన ఈ భారీ సైబర్ దాడిలో ఆరు లక్షల ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం ప్రభావితమైందని తెలిసింది. దీంతో ఎస్బీఐ ఆ కస్టమర్ల కార్డులను బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన 6.29 లక్షల కార్డులను రీప్లేస్మెంట్లో కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద రీప్లేస్మెంట్.
95.5 శాతం కార్డులను అక్టోబర్ 26న మంజూరు చేశామని, మిగతావారి కాంటాక్ట్ సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నామని బ్యాంకు తెలిపింది. ఇప్పటి వరకూ వారు సంబంధిత బ్రాంచ్ల వద్ద సమాచారం అప్డేట్ చేయించుకోలేదని ఎస్బీఐ కార్పొరేట్ స్ట్రాటజీ, న్యూ బిజినెస్ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్ చెప్పారు. ఆ కస్టమర్లు కూడా బ్రాంచ్లను వద్ద సంప్రదించి, కొత్త కార్డులను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మొత్తం 19 వివిధ బ్యాంకులపై ఈ సైబర్ అటాక్ జరిగింది. ఈ దాడిలో 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more