బాలీవుడ్ టాప్ తారలంతా త్వరలో ఓ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారా? అది కూడా దక్షిణాదిన జరగబోయే ఓ మాజీ మంత్రి ఇంట. అదెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును... ఇప్పటికే ఎల్సీడీ వెడ్డింగ్ కార్డుతో దేశం మొత్తం తన కూతురి పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేసిన కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
నవంబర్ 16న బెంగళూర్ లోని పాలెస్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విక్రమ్ దేవరరెడ్డి కొడుకు రాజీవ్ తో గాలి కూతురు బ్రాహ్మిణి వివాహం జరగనుంది. ఈ పెళ్లి కోసం సుమారు 550 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.
పెళ్లి కోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో గాలి బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతోసహా ఇప్పటికే చాలా మంది జాతీయ నేతలకు, ముఖ్యమంత్రులకు, కేబినెట్ మంత్రులకు, వీవీఐపీలకు ఆయన కార్డులను అందజేశాడు. ఇంకోవైపు సినీ సెలబ్రిటీలను కూడా ఆయన ఆహ్వానించాడు. కన్నడలోని టాప్ స్టార్లకు ఇంటికి స్వయంగా వెళ్లిన జనార్దన్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రత్యేక ఆహ్వానం పంపాడు. ఇక పెళ్లికి ప్రత్యేకత తేవాలి అనకున్నాడో ఏమో ఏకంగా బాలీవుడ్ తారలతో కచేరీ పెట్టించేందుకు సిద్ధమైపోతున్నాడు.
ఆ వివాహ వేడుకలో టాప్ తారలు ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, కత్తినా కైఫ్, సౌత్ స్టార్లు ప్రభుదేవా, తమన్నాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కన్నడ, కోలీవుడ్ వర్గాలకు చెందిన నటీనటులు కూడా స్టేజీ ఫెర్ పార్మెన్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేసిన గాలి పెళ్లి ఇంకెంత వైభవంగా చేస్తారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోపక్క ఆదాయ పన్నుల శాఖ కూడా ఓ కన్నేసి ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more