బాలీవుడ్ టాప్ తారలంతా త్వరలో ఓ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారా? అది కూడా దక్షిణాదిన జరగబోయే ఓ మాజీ మంత్రి ఇంట. అదెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును... ఇప్పటికే ఎల్సీడీ వెడ్డింగ్ కార్డుతో దేశం మొత్తం తన కూతురి పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేసిన కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్రెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
నవంబర్ 16న బెంగళూర్ లోని పాలెస్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త విక్రమ్ దేవరరెడ్డి కొడుకు రాజీవ్ తో గాలి కూతురు బ్రాహ్మిణి వివాహం జరగనుంది. ఈ పెళ్లి కోసం సుమారు 550 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.
పెళ్లి కోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో గాలి బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతోసహా ఇప్పటికే చాలా మంది జాతీయ నేతలకు, ముఖ్యమంత్రులకు, కేబినెట్ మంత్రులకు, వీవీఐపీలకు ఆయన కార్డులను అందజేశాడు. ఇంకోవైపు సినీ సెలబ్రిటీలను కూడా ఆయన ఆహ్వానించాడు. కన్నడలోని టాప్ స్టార్లకు ఇంటికి స్వయంగా వెళ్లిన జనార్దన్, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రత్యేక ఆహ్వానం పంపాడు. ఇక పెళ్లికి ప్రత్యేకత తేవాలి అనకున్నాడో ఏమో ఏకంగా బాలీవుడ్ తారలతో కచేరీ పెట్టించేందుకు సిద్ధమైపోతున్నాడు.
ఆ వివాహ వేడుకలో టాప్ తారలు ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, కత్తినా కైఫ్, సౌత్ స్టార్లు ప్రభుదేవా, తమన్నాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కన్నడ, కోలీవుడ్ వర్గాలకు చెందిన నటీనటులు కూడా స్టేజీ ఫెర్ పార్మెన్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేసిన గాలి పెళ్లి ఇంకెంత వైభవంగా చేస్తారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోపక్క ఆదాయ పన్నుల శాఖ కూడా ఓ కన్నేసి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more