మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన కేసులో రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి మాటమార్చారు. నిబద్దతకు, నిజాయితీకీ నిలువుటద్దం లాంటి రాజకీయాలో ఉన్నత స్థాయితో కొనసాగుతున్న వ్యక్తి ఏకంగా తన మాటకు విలువ లేదని చెప్పకనే చెప్పేశాడు. తన మాటకే కట్టుబడని వ్యక్తి ప్రజల ప్రాణాలకు ఏమి విలువనిస్తాడు. ఆయన మరెవరో కాదు జార్ఖండ్ లోని అధికార బీజేపి తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రణధీర్ కుమార్ సింగ్. మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో కీలక సాక్షిగా వున్న ఆయన ఏకంగా మాట మార్చి కేసులో ట్విస్టు పెట్టారు. కేసులో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన అయన న్యాయస్థానంలో తన వాంగ్మూలం ఇచ్చారు.
ఈ కేసులో కీలక నిందితుడైన సునీల్ జోషి ఎవరో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారులు బలవంతపెట్టి గతంలో స్టేట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. దేవేందర్ గుప్తా అనే నిందితుడు ముస్లిం వ్యతిరేకి కాదని రణధీర్ తాజాగా పేర్కొన్నారు. మక్కా మసీదు కేసుకు పూర్వం అజ్మీర్ దర్గా కేసులో కూడా రణధీర్ ఇలానే మాట మార్చారు. కేసు దర్యాప్తు అధికారులకు ఒకలా వాంగ్మూలం ఇచ్చిన రణధీర్.. ఆ తరువాత న్యాయస్థానంలో మరోలా వాంగ్మూలం ఇస్తూ కేసును మలుపు తిప్పుతున్నారు.
2007 మే 18న మక్కామసీదులో బాంబు పేలడంతో 9 మంది మృతి చెందారు. 50 మందిపైగా గాయపడ్డారు. ఈ కేసులో జోషి, గుప్తాతో పాటు తొమ్మిది మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది. తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. 'సునీల్ జోషి, దేవేందర్ గుప్తా తనకు తెలుసునని రణధీర్ చెప్పినట్టు సీబీఐ మొదటి చార్జిషీటులో పేర్కొంది. వారిద్దరూ తనకు సన్నిహితులని, తనింటికి తరచూ వస్తుండేవారని తెలిపారని వెల్లడించింది. గుప్తా చాలా ఆవేశపరుడని, ముస్లింల పట్ల అతడికి వ్యతిరేకభావం ఉందని కూడా అన్నట్టు తెలిపింది. తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన రణధీర్ జోషి ఎవరో తనకు తెలియదని, స్టేట్ మెంట్ పై సీబీఐ బలవంతంగా తనతో సంతకాలు పెట్టించిందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more