కర్ణాటకలోని కోటిలింగేశ్వర్ అలయ అధికారిపై అగంతకుడు నిర్థాక్షిణ్యంగా దాడి చేశాడు. అమె అలయంలోని తన కార్యలయం బయట పిట్టగోడ నుంచి ఏవరితోనే మాట్లాడుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన అగంతకుడు అమె తలపై బలంగా కత్తితో దాడి చేశాడు. అమె తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలో మరోమారు అధికారినిపై దాడి చేశాడు. ఈ క్రమంలో కార్యాలయంలోకి వచ్చిన పలువురు అగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు తప్పించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన అధికారి భక్తులు, కార్యాలయ సిబ్బంది హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అమె పరిస్థితి విషమంగానే వున్నట్లు ఆర్ ఎల్ జలప్ప అసుపత్రి వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న బంగార్ పేట్ తాలుకాలోని బేత్ మంగళ పోలీసులు రంగంలోకి దిగి అలయ అధికారిపై దాడికి పాల్పడిన యువకుడని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా, తన పేరు సంతోష్ అని చెప్పిన యువకుడు.. తన తండ్రి గతంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు గాను బిల్లులు చెల్లింపులో జాప్యమే అతని దాడికి కారణమని తెలిసింది. గతంలో అమె కమ్మసండ్ర గ్రామపంచాయితీ అధికారిణిగా వున్న సమయంలో తన తండ్రి అదే గ్రామంలో పనులు చేశారని, అందుకు గాను తమకు రావాల్సిన బిల్లుల విషయంలో అమె జాప్యం చేసిందని తెలిపాడు.
ఎన్ని సార్లు బిల్లుల చెల్లింపుల విషయమై అమెను అర్థించినా.. అమె పట్టించుకోలేదని, అదే బెంగతో తన తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడని అగంతకుడు పోలీసులకు వివరణ ఇచ్చాడు, తన తండ్రి మరణానంతరం తాను కూడా బిల్లుల కోసం అనేక పర్యాయాలు అధికారి కుమారి చుట్టూ తిరిగానని.. అమె పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చేసేది లేక చివరాఖరున తాను దాడికి పాల్పడినట్లు చెప్పారు. సంతోష్ కత్తి దాడిలో తీవ్రగాయాల పాలైన అధికారి కుమారి పరిస్థితి విషమంగానే వుందని వైద్యులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more