శీర్షిక చూసి ఇదేదో ప్రమాదకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియో అనుకుంటున్నారేమో... కానే కాదు.. మానవుని మరణం తరువాత అతని పార్థీవ దేహాన్ని విడిచి ఆత్మ.. పరమాత్మలో ఐక్యం అవుతుందని మన పూర్వికుల నుంచి మనం తెలుసుకున్నాం. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం సంపాధించలేకపోయాం, అయితే దీనిని విశ్వసించని అనేక మంది ఆదారాల కోసం అన్వేషణ సాగిస్తూనే వున్నారు. అసలు మనిషి మరణం తర్వాత ఏమిటి? అన్న విషయం వందల వేల సంవత్సరాలనుంచీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది.
పెద్దలు చెప్పినట్లు మరణం శరీరానికే తప్పించి ఆత్మకు ఉండదు అనేది నిజమని ఇప్పుడు నమ్మకంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా అటువంటి విషయాలు నిజమని చెబుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విశ్వాంతరాలకు చేరుకుంటూ... మనిషి మరణాన్ని సైతం జయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలోనూ ఆత్మల విషయంలో ఓ క్లారిటీ లేదన్నది వాస్తవం. అంగారక గ్రహానికి ఉపగ్రహాలను పంపుతూ.. మార్స్ పై మంచినీళ్లు వున్నాయని సాంకేతిక విప్లవం సాయంతో తెలుసుకున్న తరుణంలో మనిషి మరణం తరువాత ఏం జరుగుతుందన్న విషయంలో మాత్రం స్పష్టం ఇంకా రాలేదు.
అయితే ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద దుర్ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది. ఓ రోడ్డు ప్రమాద ఘటనలో సీసీ కెమెరాకు చిక్కిన ఫుటేజీ లక్షల వ్యూయర్లను ఆకట్టుకుంటోంది. యూ ట్యూబ్ లో యాక్సిడెంట్ వీడియో పోస్టు చేసిన రెండు రోజుల్లోనే సుమారు 6 లక్షల మంది వ్యూయర్లను ఆకట్టుకుంది. వేలకొద్దీ కామెంట్లతో కొనసాగుతోంది. ధాయ్ లాండ్ రోడ్డు దాటుతున్న కారును వేగంగా వచ్చిన మోటర్ బైట్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్ పై వెళ్తున్న దంపతులు ఎగిరి పడ్డారు. అయితే బైక్ వెనక కూర్చున్న మహిళ అక్కడికక్కడే మరణించింది.
అలా ఆమె మరణించగానే అమె శరీరాన్ని వదిలిని ఆత్మ నల్లని ఆకారంలో అక్కడ కొద్దిసేపు నిల్చుండిపోయింది. ఆ తరువాత కిద్దిసేపటికి అదృశ్యమైంది. ఇదంతా ఘటనాస్థలానికి చేరువలోని సిసిటీవిలో ఇది నిక్షిప్తం కావడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. కానీ వీడియోను చూసిన వినియోగదారులు కొందరు ఆత్మను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చని, సాంకేతికతను వినియోగించి గ్రాఫిక్స్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటు నమ్మకస్తులు, అటు విమర్శకుల వీక్షణంతో ఇప్పుడా వీడియో య్యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more