తెలంగాణ సర్కారు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. గత పాలకులు తెలంగాణ రైతుల గురించి పట్టించుకోలేదని ఆయన అన్నారు. అటువంటి వారు రైతుల కోసం అంటూ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కారు చేస్తోన్న అభివృద్ధిని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. అందుకే తమపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు.
గురువారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లడిల్లారని ఆయన వ్యాఖ్యానించారు. 24 గంటలూ విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా తమ సర్కారు పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నడూ ద్రోహం చేయబోమని, వారికి నష్టం కలిగించే పరిస్థితే వస్తే ఉరివేసుకుని చస్తాం కానీ, అటువంటి పనులు మాత్రం చేయబోమని అన్నారు. తమ సర్కారు చేపడుతోన్న పథకాలు చూసి విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా కేంద్రంతో తెలంగాణ సత్సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు.
ఇక కొత్త జిల్లాలపై ప్రతిపక్షాలన్నీ అనవసరంగా అనుమానాలను కలిగిస్తున్నాయని, పరిపాలనా సౌలభ్యం కోసమే వాటిని సర్కార్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, కొత్త జిల్లాలతో ఆ పురోగతి మరింత ముందుకు వెళ్తుందని తుమ్మల చెప్పుకోచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more