తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో విచారణ తిరిగి చేపట్టాలని సోమవారం ఏసీబీ కోర్టు అధికారులను ఆదేశించింది. తగిన చర్యలతో పూర్తి నివేదిక రూపొందించి సెప్టెంబర్ 29 లోపు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది కోరారు. తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. ఆయన వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది.
కాగా, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ వీడియో, ఆడియో సాక్షాలతో సహా టీడీపీ నేత రేవంత్రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం వెలుగు చూసిన ఈ కేసులో స్టీఫెన్సన్తో మాట్లాడింది స్వయానా చంద్రబాబు అని సందేహాలు తలెత్తగా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఆ స్వరం ఆయనదేనని నివేదికలో పేర్కొంది. కేసును తిరగదోడి అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటున్న వైఎస్సార్సీపీ వ్యూహాన్ని చంద్రబాబు ఎలా ఢిపెన్స్ చేయబోతున్నారో అని రెండు రాష్ట్రల్లో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more