సరిగ్గా ఏడాది క్రితం మునుకోటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పత్రికల్లో, చానెళ్లలో మారుమ్రోగిపోయింది. తిరుపతిలో ప్రత్యేక హోదాను డిమాండ్ తో నినదిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్న యువకుడు. వందలాది మంది చూస్తుండగానే, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న మునికోటి వార్తను జాతీయ మీడియా కూడా హైలెట్ చేసి ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో తెలియజేశాయి. కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న మునికోటి కుటుంబాన్ని ఆదుకుంటామంటూ అప్పట్లో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు కూడా.
ఏడాది గడిచింది. రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తామని చెప్పిన సర్కారు, ఇచ్చిన మాటను మరచింది. సొంత కార్యకర్తకు 2 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. హోదా కోసం ఎంతో తాపత్రయపడి ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడి ఆశయం నెరవేరకపోగా, తమ కుటుంబానికి అందించాల్సిన ఆసరా కూడా దక్కలేదంటూ మునికోటి సోదరుడు మురళి వాపోతున్నాడు. ఈ క్రమంలో జనసేన తరపున ఆర్థిక సాయం ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఘటనకు సోమవారంతో ఏడాది నిండటం, వారి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న నటుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు ఆయన జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో, రేపో తిరుపతి వెళ్లనున్న రాఘవయ్య సదరు మొత్తాన్ని మునికోటి కుటుంబానికి అందజేయనున్నారు.
తన ప్రచారంతో కూటమిని అధికారంలోకి తెచ్చిన పవన్ ఆపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చానంటూ గతంలో చెప్పాడని, మరి హోదా పైన బీజేపీని ఎందుకు నిలదీయడం లేదంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి కుటుంబానికి ఎవరూ పట్టించుకోకపోయినా, ఆయన ఆర్థిక సాయం చేయటం ద్వారా వాళ్ల నోళ్లు మూయించినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more