కాశ్మీర్ విముక్తి కోసం భారతదేశంతో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ ముఖ్యనేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించిన నేపథ్యంలో సదరు అంశమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ భరితెగింపు వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలపై ఉద్రవాద సంస్థ ముఖ్యనేత సయీద్ సలహాద్దిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు.
కాశ్మీర్ గురించి చర్చించడానికి ఉగ్రవాద సంస్థకు, దాని ముఖ్యనేత సయీద్ సలావుద్దీన్ కు ఏం హక్కు వుందని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ తగలబడుతున్నా.. వాటిపై చర్యలు తీసుకోవడంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైనందునే వారు చివరకు దేశానికి సంబంధించిన అంశాలపై వ్యాఖ్యలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి ఉగ్రవాద సంస్థ
ఎవరని ఆయన ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ పాకులాట కోసమే సలహుద్దీన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
భారత్ దేశంలోకి అక్రమంగా ఉగ్రవాదుల చోరబాటును ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకు రావడం సరైందా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించారాయన. అలాగే సలహుద్దీన్ బెదిరింపులు తమను ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు. కాశ్మీర్ లో ఇప్పటికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, ఇకనైనా పాకిస్థాన్ ఇలాంటి చర్యలను స్వస్తి పలకాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more