పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో మిట్టమధ్యాహ్నం బ్యాంకులో దోపిడి జరిగింది. కూతవేటు దూరంలో పోలిస్ స్టేష్టన్ వున్న.. ఎలాంటి జంకు బొంకు లేకుండా నిర్భయంగా దొంగలు తమ ప్రతాపాన్ని చాటి పోలీసులకు సవాల్ విసిరారు. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో కేవలం 90 సెకన్ల వ్యవధిలోనూ తమ పని కానిచ్చేశారు. ఈ దోపిడిలో పాల్గొన్నది మాత్రం కేవలం నలుగురంటే నలుగురే వ్యక్తులు. అయితే ఎంత పక్కగా స్కెచ్ వేశారో.. ఎన్ని రోజుల నుంచి రెక్కీలు నిర్వహిస్తున్నారో తెలియదు కానీ నిమిషమున్నర వ్యవధిలోపు మొత్తం పని పూర్తిచేసేశారు.
పంజాబ్లోని లూథియానాలో గల పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ. 15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. ఆ బ్రాంచి కూడా కోచర్ మార్కెట్ పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలోనే ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే సమయానికి బ్యాంకులో ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. ఈ సమాచారాన్నంతా ముందుగానే రెక్కీలు నిర్వహించిన దొంగలు పక్కగా రాబట్టారు. నిన్న మధ్యాహ్నం తమ స్కెచ్ ను పక్కగా అమలుపర్చి పారిపోయారు.
బ్యాంకు అధికారులు ఈ దోపిడిపై పోలీసులకు పిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు ముసుగు దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన అంకుశ్ చౌదరి అనే కస్టమర్ను కొట్టారు. ఇద్దరు దొంగలు లాబీలోనే ఉన్నారు. వాళ్లలో ఒకడు కౌంటర్ లోంచి క్యాషియర్ తలకు తుపాకి గురిపెట్టాడు. మూడో దొంగ మేనేజర్ను బంధించగా నాలుగో వ్యక్తి క్యాషియర్ వెనక్కి వెళ్లి, కొద్ది నిమిషాల క్రితమే కస్టమర్ డిపాజిట్ చేసిన రూ. 15 లక్షలు తీసుకున్నాడు.
అదే సమయానికి బ్యాంకు లోపలకు వస్తున్న ఓ మహిళ.. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అందరికీ విషయం చెప్పారు. కానీ చుట్టుపక్కల వాళ్లు ఘటనపై ధైర్యం తెచ్చుకుని స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. కాగా పోలీసులు మాత్రం బ్యాంకు దోపిడీలో ఇంటిదోంగల ప్రమేయం వుండి వుంటుందని అనుమానిస్తున్నారు. ఈ బ్యాంకులో క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్ల ప్రమేయం కూడా వుండివుండవచ్చునన్న అనుమానాలతో వారి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more