పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డైరెక్ట్ అటాక్ చేశారు. ధరల పెరుగుదలపై నిలదీశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు. ధరలు తగ్గించే తేదీని ప్రకటించాలని రాహుల్ కోరారు. ధరలను ఎప్పుడు నియంత్రించగలరో, ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు తగ్గిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని సూచించారు.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ విధానాలను తీవ్రంగా ఆక్షేపించిన రాహుల్ బీజేపీ రెండేళ్ల పాలనను తూర్పారా పట్టారు. 'మోడీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన మోడీ మేక్ ఇండియా, కనెక్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ మాట్లాడారు తప్పితే, దేశంలో పెరిగిన పప్పులు, ఆలుగడ్డలు, టొమోటో ధరలపై మాత్రం నోరు మెదపలేదని' ఆరోపించారు రాహుల్. ధరల పెరుగుదలకు సంబంధించి నిబద్దతలేని హామిలు ఇవ్వడం సరికాదన్న రాహుల్ సూచించారు.
స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాల్లో నకిలీ హామిలు ఇవ్వవచ్చేమో గానీ ధరల పెరుగుదలలో మాత్రం కాదని ప్రధాని మోడీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వ పోకడలను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన..స్వచ్ఛ భారత్ ద్వారా దేశమంతా పరిశుభ్రంగా మారిందని అధికార పక్షాన్ని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. స్వచ్ఛభారత్తో దేశమంతా పరిశుభ్రమైందని రాహుల్ ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more