ఊహించినట్లుగానే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. అసెంబ్లీ కి శాసనసభ స్థానాలు పెంచే ప్రసక్తే ఎట్టి పరిస్థితిలో లేదని తేల్చిచెప్పింది. సీట్ల పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని కుండబద్దలు కొట్టింది. 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణకు అవకాశం ఉందని పేర్కొంటూ తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లింది.
టీడీపీ ఎంపీ దేవేందర్గౌడ్ బుధవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్న కు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోంశాఖ కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిందా? అదే జరిగితే ఆ వివరాలేంటి? అంటూ దేవేందర్గౌడ్ వివరాలు కోరారు. దీనికి స్పందించిన మంత్రి హన్స్రాజ్ ఆర్టికల్ 170ని సవరించకుండా పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో ఒక రకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో మరో రకంగా ఉన్నాయని, ఈ రెండూ సంఘర్షించుకుంటే ఏది చెల్లుబాటు అవుతుందనే విషయంపై న్యాయశాఖ సలహా కోరినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేమని భారత అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఆర్టికల్ 170లోని ‘నిబంధనలకు లోబడి’ అన్న వ్యాక్యానికి బదులు ‘నిబంధనలకు సంబంధం లేకుండా’ అన్న వాక్యం చేర్చి సవరించినా కుదరదని అటార్నీ జనరల్ చెప్పినట్టు మంత్రి పేర్కొన్నారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్టు వివరించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే దీనివెనకే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్ద ఆలోచనే చేసింది. శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే ప్రాంతీయ పార్టీలే లాభపడతాయి తప్ప తమకేం ఒరగదని ఇలా తప్పించుకుంటుందని అర్థమౌతోంది. ఇంకోవైపు సీట్ల పెంపుతో లాభపడొచ్చని అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ఈ ప్రకటనతో నోట్లో వెలక్కాయ పడినట్టు అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more