హైదరాబాద్ లో పెను విధ్వంసానికి ప్రణాళిక రచించిన ముష్కరమూక మొత్తం 13 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నిందన్న వార్త నగర వాసుల్లో కలకలం రేపుతోంది. ఇందులో పోలీసు స్టేషన్లు, జన సమ్మర్థమున్న మాల్స్, రక్షణ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఇప్పటికే మనకు తెలుసు. వీటన్నిటి వివరాలతో ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్న వారి బాస్ లకు ఎప్పటికప్పుడు ఈ-మెయిల్స్ తదితర మాధ్యమాల ద్వారా సమాచారం పంపుతున్నారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు విచారణలో వెలుగు చూస్తున్న మరిన్ని షాకింగ్ విషయాలను బయటపెడుతోంది. రాష్ట్రంలోని ఆరుగురు ప్రముఖ వ్యాపారవేత్తలను హత్య చేయాలని కూడా వీరు కుట్ర పన్నారని తేల్చారు.
నగరానికి చెందిన ఈ ఆరుగురి ప్రముఖులపై నిఘా పెట్టిన పట్టుబడిన ఐదుగురు వారి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. వారి ప్రతీ కదలికను జాగ్రత్తగా పరిశీలించిన ఎప్పటికప్పుడు ఆ నివేదికను హైకమాండ్ కు పంపారంట. ముందు కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు గుంజడం, ఆపై వీరిని చంపడం ద్వారా పోలీసులు ఆ విచారణలో ఉండగా, తమ పని చేసుకునేందుకు ఈజీ అయిపోతుందనేది వారి ఫ్లాన్. ఇక ఐసిస్ అనుబంధ జేకేబీహెచ్ (జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్)కు నిధులందించిన ఫైనాన్షియర్లను తక్షణం అదుపులోకి తీసుకోకుంటే, మరో ఉగ్ర బృందం వారి కార్యాచరణ అమలుకు ఏర్పడుతుందని ఎన్ఐఏ ఆందోళన చెందుతోంది. వీరిని గుర్తించేందుకు ఉగ్రవాదులను మరింతగా విచారించాల్సి వుందని అధికారులు అంటున్నారు.
రాజస్థాన్ ప్రాంతం నుంచి హవాలా ఏజంట్ల ద్వారా ఇక్కడి ఉగ్రవాదులకు నిధులు వచ్చాయని, ఇవి రియాల్స్ కరెన్సీలో రాగా, వాటిని ఇక్కడే మార్చుకున్నారని కూడా విచారణలో వెల్లడైంది. అరెస్టయిన నిందితులు తమ మనసులో ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడం లేదని అభిప్రాయపడుతున్న విచారణాధికారులు, ఇప్పటికే ఇదే విషయాన్ని కోర్టుకు సైతం వెల్లడించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారినిరెక్కీ నిర్వహించిన ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more