టక్..టక్..టక్.. మనీ మీ తలుపు తడుతుంది... వెంటనే మీరు డోర్ ఓపెన్ చేస్తారు. ఇంతలో నవ్వుతూ పోస్ట్ మాన్ చేతిలో ఓ బాటిల్ తో దర్శనమిస్తాడు. సార్/మేడమ్ ఇదుగోనండి మీరు ఆర్డర్ చేసిన గంగా జలం అంటూ మీ చేతిలో పెడతాడు. పవిత్ర గంగా నీటి కోసం అంత దూరం వెళ్ల లేని వాళ్ల కోసం తమిళనాడు ప్రజలకు అక్కడి అధికారులు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.
వ్యయ ప్రయాసలతో కూర్చి గంగోత్రి, యమునోత్రి, రిషికేశ్ లాంటి పవిత్ర నదులను దర్శించుకోలేని ప్రజల కోసం పోస్టాఫీసుల ద్వారా గంగాజలాలను అమ్మనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెన్నైలోని అన్ని పోస్టాఫీసుల్లో గంగాజలాన్ని విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా రెండు పోస్టాఫీసుల్లో ఈ బాటిళ్లను అమ్మకానికి ఉంచగా, విక్రయాలు ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని బాటిళ్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు.
500 మిల్లీలీటర్ల గంగోత్రి జలాన్ని 35 రూపాయలకు, 200 మిల్లీలీటర్ల బాటిల్ ధర 25 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రిషికేశ్ గంగాజలం బాటిల్ ధర 500 మిల్లీలీటర్లు 22 రూపాయలు కాగా, 200 మిల్లీలీటర్లు గంగాజలం 15 రూపాయలని వారు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పవిత్ర గంగాజలం బాటిళ్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నామని, ఆన్ లైన్ అమ్మకాలు కూడా ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.
అయితే ఈ నీటిని నింపే ప్రక్రియ ఎవరూ చేస్తున్నారు? అదసలు నిజంగా గంగా జలమేనా? బాటిల్స్ లోని నీరు సురక్షితమైనదేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు మొదలౌతున్నాయి. అధికారులు కూడా ఈ విషయంలో గోప్యతను ప్రదర్శించడం పలు అనుమానాలకు తావునిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more