అధికారంలో వున్నది తమ ప్రభుత్వం, అనుకోకుండా జరిగిన ప్రమాదం నుంచి తన కొడుకును రక్షించుకునేందుకు రాజస్తాన్ ఎమ్మెల్యే ఎన్ని ఎత్తులు వేసినా.. వాటన్నింటినీ చిత్తు చేశారు పోలీసులు. చివరకు సిసిటీవీ ఫూటేజీలు, రిసిప్టులు అధారంగా పోలీసులు ఎమ్మెల్యే కొడుకుపై పకడ్భందీగా కేసును నమోదు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా చుట్టూ పోలీసులు ఉచ్చు భిగించారు. ఓ ఆటోను బీఎండబ్యూ కారు ఢీకొన్నప్పుడు తన కుమారుడు కారును నడపడం లేదని, డ్రైవర్ నడిపాడని చెప్పారు
ఇక మీడియా సహా పలువురు ప్రతిపక్షాలు అరోపిస్తున్నట్లు తన కుమారుడికి మద్యం తాగే అలవాటే లేదని, పాలు తప్ప, మరోటి తాగడని, యాక్సిడెంట్ అయిన రాత్రి ఎదురుగా వచ్చిన ఆటోకు అసలు లైట్లు లేవంటూ తన కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తులన్నీ పోలీసుల ముందు చిత్తయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన రోజున యాక్సిడెంట్కు ముందు సిద్ధార్థ్ మారియా ఓ బార్కు, రెండు హోటళ్లుకు వెళ్లాడని, వాటిల్లో మద్యం సేవించాడని ఆ బార్ను, హోటళ్ల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజుల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఓ బార్లో కూర్చొని స్పానిష్ వైన్ సేవించినట్లు ఫుటేజ్లో తేలింది. కొసేకా బ్రాండ్కు చెందిన వైన్ సేవించినట్లు కూడా సీసీటీవీల్లో రికార్డయింది.
అంతేకాదు మద్యం సేవించిన అనంతరం కారును సిద్ధార్థే నడపడం, ప్రమాదం అనంతరం కారులోని డ్రైవర్ సీటు నుంచి సిద్ధార్థ దిగడం కూడా వీధుల్లోని సీసీటీవీ కెమేరాలు బయటపెట్టాయి. సీసీటీవీ ఫుటేజ్లతోపాటు బార్, హోటళ్లలో సిద్ధార్థ చెల్లించిన బిల్లులు అక్కడి సిసిటీవీ ఫూటేజ్ లను కూడా జైపూర్ పోలీసులు సేకరించి సిద్ధార్థపై పగడ్బందిగా కేసును నమోదు చేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆటో హెడ్లైట్లు లేకుండా దూసుకొచ్చింది అంటూ ఎమ్మెల్యే చేసిన వాదన కూడా వీగిపోయింది. పోలీసు దర్యాప్తులో ఆటో హెడ్లైట్లు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more