మహ్మదీయుల పవిత్ర పర్వదినం రంజాన్ పండగకు ముందు ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హైదరాబాద్ లో కూడా విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రణాళికలు రచించి.. భంగపడ్డారు. కాగా హైదరాబాద్ పాత నగరంలో మరోసారి కలకలం రేగింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మరోసారి సోదాలు నిర్వహించింది. ఇటీవల పట్టుబడి పోలీసులు అదుపులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పాతబస్తీలోని తలాబ్ కట్టా, బార్కాస్ లో ఎన్ఐఏ అధికారులు మంగళవారం సోదాలు జరిపారు. 17 బుల్లెట్లు, 2 స్కానర్లు కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉదంతంలో ఎన్ఐఏ ఇప్పటికే ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అరెస్టు చేయడం తెలిసిందే.
దర్యాప్తులో ఐదు రోజులుగా వారు వెల్లడించిన అంశాల మేరకు ఎన్ఐఏ మళ్లీ సోదాలు నిర్వహించింది. తాలాబ్కట్టలోని ఇబ్రహీం నివాసంపై దాడి చేసి కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న హబీబ్ నివాసంలో కంప్యూటర్తో పాటు 9 ఎంఎంకు చెందిన 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంప్యూటర్ ద్వారానే హబీబ్ తరచూ ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్తో మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఇబ్రహీం బావమరిదికి చెందిన షాలిమార్ మీసేవా కేంద్రంలోని మరో కంప్యూటర్, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ లోనూ ఎన్ఐఏ అధికారులు చేపట్టి నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. మరికొన్ని నగరల్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం. హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన 11 మంది అనుమానిత ఉగ్రవాదులు జూన్ 29న ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురిని సాక్షులు మార్చి తర్వాత వదిలిపెట్టారు. అరెస్టైన ఐదుగురికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్ నగరంలో వారాంతంలో పేలుళ్లు, విధ్వంసాలకు వీరు కుట్ర పనినట్టు వెల్లడైంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more