ఇంత వరకు అన్నా చెల్లెల అనుబంధం కళ్లకు కనిపించేట్లు సినిమాలే మనం చూసి ఉన్నాం. కానీ, ఇక్కడ జరిగిన ఓ ఉదంతం వింటే అయ్యో అనుకోక ఉండలేం. తన అన్న అంటే అమితమైన ప్రేమను చంపుకోలేని ఓ యువతి ప్రాణ త్యాగం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
రాజస్థాన్లోని దుంగార్పూర్ పట్టణం సతీరాంపూర్ లో వేల రామ్ మనత్(32) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచిన దుర్గను(28) ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ, కొన్నేళ్లకు ఆమె మతిస్థిమితం కోల్పోయింది. దీంతో ఇద్దరు పిల్లలను తానే ఉంచుకుని భర్త ఆమెను వదిలేయగా, అన్న మాత్రం ఆమెను అక్కున చేర్చుకున్నాడు. పసిపాపలా ఆమెను చూసుకున్నాడు. ఆ పరిస్థితిలో కూడా దుగ్గ ఒక్క మనత్ ను తప్పా ఎవరినీ గుర్తించేది కాదు. అంతలా ఉండేది వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు.
ఇక గురువారం రాత్రి దుంగార్పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చితిపై మృతదేహం సగం కాలుతుండగా కుటుంబ సభ్యులు శ్మశానం నుంచి ఇంటికి బయలుదేరారు. కానీ, రామ్ సోదరి దుర్గ (28) అక్కడే ఉండిపోయింది. తన అన్న లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె ఒక్కసారిగా చితిపైకి దూకింది. దీనిని చూసిన ఓ 14 ఏళ్ల బాలుడు విషయాన్ని గ్రామస్తులకు చెప్పటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే దుర్గ దేహం సగం కాలిపోయింది. ఆమె మృతదేహాన్ని చితి నుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అన్న చనిపోయిన బాధలో ఉన్న తమకు దుర్గ ఇలా వదిలేసి వెళ్లిపోవటం మింగుడు పడటం లేదని మరో సోదరుడు దినేశ్ రోదిస్తూ చెబుతున్నాడు. ఈ అన్నచెల్లెల రక్తసంబంధాన్ని చూసి ఆ గ్రామం అంతా ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more