ఓ స్టోర్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేద్దామని వచ్చిన దుండగులు ఒక్కసారిగా పరుగులు పెడుతూ పారిపోయారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని క్వజులు-నటల్లోని బోతాస్ హిల్స్లో ఉన్న షుగర్ లోఫ్ సెంటర్లో చోటు చేసుకుంది. వివరాలు.. గత నెలలో వరుసగా జరిగిన చోరీలలో షుగర్ లోఫ్ సెంటర్లో ఓ టీవీ, మూడు కంప్యూటర్లను దుండగులు ఎత్తుకు పోయారు. దీంతో స్టోర్ యజమాని మోర్నే బోత్మా ఓ సెక్యురిటీ ఏజెన్సీని ఆశ్రయించింది. వారు చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ను స్టోర్లో బిగించారు.
అయితే చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ గురించి తెలియకుండా స్టోర్లో చోరీ చేయడానికి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. ముందుగా డోర్ చైన్ను కట్ చేయడానికి ప్రయత్నించి విఫలం అవ్వడంతో చివరకు గ్లాస్ డోర్ను పగలగొట్టి స్టోర్లోకి వచ్చారు. దుండగుల్లో ఒకరు టీవీని చోరీ చేయడానికి ప్రయత్నించగా, చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ ఆక్టివ్ అయ్యింది. అంతే చిల్లీ పెప్పర్ స్ప్రే అవ్వడంతో పాటూ అలారమ్ కూడా రావడంతో దుండగులు షాక్కు గురయ్యారు. ఏం జరుగుతుందో అని వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే బయటకు వెళ్లిన వారిలో ఒకరు మళ్లీ స్టోర్లోకి రావడానికి ప్రయత్నించాడు. కానీ స్టోర్ నిండా పెప్పర్ స్ప్రే అవ్వడంతో చేసేదేమీలేక ఒట్టిచేతులతోనే ఇంటి ముఖం పట్టాడు. స్టోర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.'ఇంతకు ముందు సీసీకెమెరాలు బిగించినా దుండగులు మాస్క్లు ధరించి చోరీలు చేశారు. నిజంగా చిల్లీ పెప్పర్ గ్యాస్ అలారమ్ అద్భుత ఫలితాన్నిచ్చింది' అని స్టోర్ యజమాని మోర్నే బోత్మా తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలింపుముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more