జాతీయ స్థాయిలో కీలక నేతల లోసుగులన్నీ గూఢచారి తరహాలో ఎంక్వైరీలు నిర్వహించి మరీ వారి గుట్టు రట్టు చేయడంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ ముందుంటాడు. అన్నాడీఎంకే అధినేత జయలలితపై కేసు అయితేనేం, సోనియా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అయితేనేం ఎవరినైనా సరే పక్కా ఆధారాలతో బుక్ చేయటం ఆయనకు ఏళ్ల తరబడి నుంచి వెన్నతో పెట్టిన విద్య.
తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆయనకి ఇప్పుడు మరో టార్గెట్ దొరికింది. రాజన్ ను తొలగించేందాకా వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్న స్వామి, ఆయన ఉద్వాసన దాదాపు ఖరారు కావటంతో శాంతిస్తారా అని అడిగితే... అబ్బే ఒకటి పోతే ఇంకోటి ఉందిగా అంటున్నారు. పార్టీపై, ముఖ్యంగా ప్రధాని మోదీపై అడ్డగోలుగా విరుచుకుపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన దృష్టిసారించినట్లు చెబుతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి హత్య కేసులో బీజేపీ ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి నిరసనగా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహేష్ రెండు రోజులుగా కేజ్రీ ఇంటి ముందు నిరసన చేట్టారు. సోమవారం దీనికి హాజరైన సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తాను ఐఐటీలో మెరిట్ విద్యార్థినని కేజ్రీవాల్ తరచూ చెబుతుంటాడు. కానీ, అదంతా పచ్చి అబద్ధం. అసలు కేజ్రీకి అందులో అడ్మిషన్ ఎలా దక్కిందో ఆధారాలతోసహా త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతా’’ అని అంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇంతకాలం రాజన్ దిగిపోవాలని వెంటపడ్డా, విజయం సాధించా. ఇక తర్వాతి వంతు కేజ్రీవాల్ దేనంటూ చెబుతున్నాడాయన.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more