ఆయన నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? | After Raghuram Rajan now it's Kejriwal turn

After raghuram rajan now it s kejriwal turn

Subramanian Swamy next target fix, After Raghuram Rajan now it's Kejriwal turn, All his life he (Kejriwal) has done fraud, Subramanian Swamy says Kejriwal big fraud, రాజన్ తర్వాత కేజ్రీవాలే, సుబ్రహ్మణ్య స్వామి కేజ్రీవాల్, రాజన్ అయిపోయాడు తర్వాత కేజ్రీవాల్, కేజ్రీవాల్ పచ్చి అబద్ధాల కోరు, కేజ్రీవాల్ ఐఐటీ అడ్మిషన్, తాజా వార్తలు, జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, latest news, political news, political news

BJP Rajya Sabha member Subramanian Swamy today joined party colleague Maheish Girri in a hunger strike outside Arvind Kejriwal's home in Delhi, saying that "after Raghuram Rajan", he will now focus on exposing the Chief Minister. "All his life he (Kejriwal) has done fraud. He says he was a meritorious student in IIT but I have records of how he got his admission...which I will reveal in a press conference. Till now I was Rajan ke peechhe (was going after Raghuram Rajan) and he is now gone," Mr Swamy said.

ఆయన నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా?

Posted: 06/20/2016 01:59 PM IST
After raghuram rajan now it s kejriwal turn

జాతీయ స్థాయిలో కీలక నేతల లోసుగులన్నీ గూఢచారి తరహాలో ఎంక్వైరీలు నిర్వహించి మరీ వారి గుట్టు రట్టు చేయడంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ ముందుంటాడు. అన్నాడీఎంకే అధినేత జయలలితపై కేసు అయితేనేం, సోనియా కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అయితేనేం ఎవరినైనా సరే పక్కా ఆధారాలతో బుక్ చేయటం ఆయనకు ఏళ్ల తరబడి నుంచి వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆయనకి ఇప్పుడు మరో టార్గెట్ దొరికింది. రాజన్ ను తొలగించేందాకా వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకుని కూర్చున్న స్వామి, ఆయన ఉద్వాసన దాదాపు ఖరారు కావటంతో శాంతిస్తారా అని అడిగితే... అబ్బే ఒకటి పోతే ఇంకోటి ఉందిగా అంటున్నారు. పార్టీపై, ముఖ్యంగా ప్రధాని మోదీపై అడ్డగోలుగా విరుచుకుపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన దృష్టిసారించినట్లు చెబుతున్నారు.

ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి హత్య కేసులో బీజేపీ ఎంపీ మహేష్ గిరి హస్తం ఉందని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి నిరసనగా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహేష్ రెండు రోజులుగా కేజ్రీ ఇంటి ముందు నిరసన చేట్టారు. సోమవారం దీనికి హాజరైన సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తాను ఐఐటీలో మెరిట్ విద్యార్థినని కేజ్రీవాల్ తరచూ చెబుతుంటాడు. కానీ, అదంతా పచ్చి అబద్ధం. అసలు కేజ్రీకి అందులో అడ్మిషన్ ఎలా దక్కిందో ఆధారాలతోసహా త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతా’’ అని అంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇంతకాలం రాజన్ దిగిపోవాలని వెంటపడ్డా, విజయం సాధించా. ఇక తర్వాతి వంతు కేజ్రీవాల్ దేనంటూ చెబుతున్నాడాయన.    

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subramanian Swamy  Raghuram Rajan  Kejriwal  

Other Articles