గుజరాత్ కు చెందిన ఓ మంత్రివర్యులను 'ఏనుగు' అటాడుకుంది. ఎంతలా అంటే ఆయన పరిజ్ఞానాన్ని విమర్శల పాలు చేసేంతగ. ఏనుగు మంత్రివర్యులతో అటాడుకుంటే మరి ఆయన సెక్యూరిటీ ఏం చేస్తున్నారనేగా మీ డౌట్. వాళ్లు కూడా వున్నారు. అందరి సమక్షంలోనే మంత్రిగారి పరువు పోయింది. అదెలా అంటారా..? ఏనుగు పదాన్ని ఇంగ్లీష్లో ఎలిఫ్యాంట్ అని రాయడమే. రాయడం వరకు ఓకే అయితే స్పెల్లింగ్ మిస్టెక్ రాయడంతోనే అమాత్యుల వారు విమర్శల పాలయ్యారు.
దీంతో అయ్యగారి పరిజ్ఞానానికి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన శాల ప్రవేశోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజారోగ్యం, పట్టణాభివృద్ధి, రవాణా శాఖ మంత్రి శంకర్ చౌదరి దీసలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఐక్యూను తెలుసుకునేందుకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ను బ్లాక్బోర్డుపై రాశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆయన ELEPHANTకు బదులు ELEPHENT అని రాశాడు. 'A' బదులు 'E' రాశారు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ అయింది.
దీంతో మంత్రి పరిజ్ఞానంపై ట్విట్టర్, ఫేస్బుక్లో ఓ రేంజ్లో జోక్లు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఆ విమర్శలపై స్పందించిని మంత్రి శంకర్ చౌదరీ... తప్పు ఒప్పుకోకపోగా పైపెచ్చు పిల్లల పరిజ్ఞానం తెలుసుకునేందుకే స్పెల్లింగ్ తప్పుగా రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై కూడా మంత్రిపై విమర్శలు ముంచెత్తాయి. కాగా ఎంబీఏ చదివిన శంకర్ చౌదరి ఎలిఫెంట్ స్పెల్లింగ్ తప్పు రాయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. కాగా రాన్ధాన్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన శంకర్ చౌదరి నకిలీ ఎంబీఏ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more