విశాఖపట్నం జిల్లా యువ ఐపీఎస్ అధికారి పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ ది అత్మహత్యా..? హత్యా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆయనది ఆత్మహత్య కాదన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రమాదవశాత్తూ రివాల్వర్ పేలి చనిపోయాడని నిన్న ఉదయం కథనాలు వెలుగులోకి రాగా, కాదు అయనది అత్మహత్య అని, ఆయన మరఛించిన బంగ్లాలో అయన రాసిపెట్టినట్లుగా భావిస్తున్న ఓ సూసైడ్ నోట్ కూడా దోరికిందని, అయితే ఆయన తల్లిదండ్రులు అనుమతిస్తే గాని దానిని బయటపెట్టబోమని ప్రభుత్వ వర్గాలు నిన్న సాయంత్రం పేర్కోన్నారు.
ఇదిలావుండగా, ఈ రెండు కథానాలకు భిన్నంగా మరిన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. శశికుమార్ ది ఆత్మహత్య కాదని, ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ వల్ల కూడా మరణించలేదని వార్తలు రాష్ట్ర పోలీసు వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఆయనది హత్యా..? అన్న అనుమానాలు బలపడతున్నాయి. యువ ఐపీఎస్ అధికారిని ఎవరు..? ఎందుకు చంపాల్సిన అవసరం ఏర్పడిందన్న ప్రశ్నలు కూడా రెకెత్తుతున్నాయి. ఇందుకు శశికుమార్ మృతదేహానానికి తీసిన ఎక్స్రేలో కీలక విషయాలు బయటపడ్డాయి. అవే ప్రస్తుతం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.
శశికుమార్ పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆయన తల మూడు భాగాలుగా పగుళ్లు ఏర్పడగా... గొంతులో బంతిలాంటి వస్తువు ఉన్నట్లు గుర్తించారు. మాట రాకుండా ఎవరైనా గొంతులో ఏదైనా వస్తువును కుక్కారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పాడేరు చేరుకున్న సీఐడీ టీమ్ విచారణ ప్రారంభించింది. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఏఎస్పీ బంగ్లాలో కాల్పులు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయన గదిలోకి చేరుకుని రక్తపు మడుగులో వున్న ఆయనను అస్పత్రికి తరలించారు. అప్పటికే అయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more