నీవే దిక్కు ..నీవు తప్ప నాకెవ్వరు లేరు తండ్రీ… అంటూ గజేంద్ర మోక్షంలో ప్రార్థించగానే కాస్త ఆలస్యంగా అయినా కదిలి వచ్చిన విష్ణువు మొసలి బారి నుంచి ఏనుగును కాపాడాడు. కానీ, మన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అలా కాదు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు వెంటనే స్పందిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరంగా వారిని ఆదుకుంటున్నాడు.
పుణెకు చెందిన ఆరేళ్ల బాలిక వైశాలి యాదవ్ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేస్తేనే ఆమె బతుకుతుందని వైధ్యులు తేల్చి చెప్పారు. పేదరికానికి మగ్గుతున్న ఆమె కుటుంబానికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేరు. దీంతో వైశాలికి ఓ ఆలోచన వచ్చింది. తన వ్యాధి, పేదరికాల గురించి ఆమె ఓ లేఖ రాసి, దానికి తన స్కూల్ ఐడీ కార్డును జతచేసి ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) పంపింది. అంతే కేవలం అయిదంటే అయిదు రోజుల్లో స్పందించిన ప్రధాని మోదీ.. ఆమెకు చికిత్స చేయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు లేఖ రాయించారు.
ఇక కలెక్టర్ చోరవతో కదిలిన రూబీ హాల్ క్లినిక్ ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేసింది. "ఎన్నో ఆసుపత్రులకు మా అంకుల్ వెళ్లారు. ప్రయోజనం లేకపోయింది. నా పక్కన విచారంగా కూర్చున్న ఆయనను చూస్తుండగానే టెలివిజన్ స్క్రీన్పై మోదీ కనిపించారు. వెంటనే పెన్నూ పేపరూ తెచ్చాను. నా పరిస్థితిని వివరిస్తూ మోదీకి లేఖ రాస్తానని చెప్పాను. అప్పుడు ఉచితంగా ఆపరేషన్ జరుగుతుందని అన్నాను. మా అంకుల్ కూడా సరేనన్నారు. నా నోట్బుక్లో ఒక పేజీ చించి మోదీకి సవివరంగా లేఖ రాశాను. నా గుండె పరిస్థితి వివరించి చెప్పాను" అని వైశాలి తెలిపింది.
వైశాలి కుటుంబం దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నప్పటికీ అందుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో చికిత్సకు వీలుపడలేదు. కాగా, బాలికకు ఆపరేషన్ చేయాలని నేరుగా ప్రధానమంత్రి నుంచే లేఖ రావడంతో షాక్ కి గురైనట్లు జిల్లా సర్జన్ డా.సంజయ్ దేశ్ ముఖ్ తెలిపారు. కాగా, ఇలా సాయం కావాలంటూ వస్తున్న విజ్నప్తులను తన దృష్టికి తీసుకురావటంతోపాటు, త్వరగతిన వాటిని పరిష్కరించాలని ఆయన పీఎంవో అధికారులను ఆదేశించారంట.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more