తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. చంద్రబాబుకు హింసా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యగా అయన అభివర్ణించారు. ‘1984లో ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు రామకృష్ణా థియేటర్లో కూర్చొని ఫోన్ల ద్వారా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రేరేపించినది ఎవరని ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి హత్య రోజున అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలు పెట్టి తగలబెట్టండని దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?’ అని నిలదీశారు.
కాపు ఉద్యమంలోనే హింసాత్మక ఘటనలు చోటుచుసుకున్నాయని ప్రజల్ని మధ్యపెడుతున్న చంద్రాబాబును ఈ కేసులకు సంబంధించి ముందుగా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేరం చేసేవాడికన్నా, తెర వెనకునుండి ప్రోత్సహించేవాడికే పెద్ద శిక్ష పడుతుందని.. అలాంటప్పుడు ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి చంద్రబాబును ఏ-1 గా చేర్చి అరెస్టు చేయాలన్నారు. రాజమండ్రి పుష్కరాలకు రాష్ట్రంలోని పోలీసులను తరలించి.. సొంత ఇమేజ్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న బాబూ.. దీనిపై ఎందుకు కేసులు లేవు.. ఎవరిని అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. కాపు కులాలైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను విభజించి తమ జాతిని దగా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.
తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసును ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోని పక్షంలో ఈనెల 9 నుంచి తాను మరోమారు అమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తానని హెచ్చరించారు. తమ కులస్థులపై పెట్టిన కేసులను ఇవాళ సాయంత్రానికి ఉపసంహరించుకోవాలని ఆయన డెడ్ లైన్ కూడా విధించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం తమ కాపు కులస్థులను నేరస్థులుగా, అరాచక శక్తులుగా చూపించి కేసులు పెట్టారన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more