నూతన జాతీయ విద్యా విధానంపై తామిచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని లేనిపక్షంలో అపనని తామే చేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీని మాజీ క్యాబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఈ మేరకు ఆయన స్మృతి ఇరానీకి లేఖ రాశారు. తమ ప్యానెల్ రూపోందించిన నివేదికను, అందులోని సూచనలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం కోసం వరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సుబ్రహ్మణ్యన్ చైర్మన్ వ్యవహరించారు.
ఇటీవల నూతన జాతీయ విద్యావిధానంపై క్షేత్రస్థాయి నుంచి అధ్యయనం చేసిన కమిటీ 33 అంశాలపై పలు సూచనలు పేర్కోంటూ సుమారుగా 200 పేజీలకు పైగా నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో గుజరాత్, ఢిల్లీకి చెందిన మాజీ మానవ వనరుల శాఖ కార్యదర్శులు, శైలజా చంద్ర, సుధీర్ మన్ కడ్, మాజీ ఎన్సీఈఆర్టీ ఛీఫ్ జేఎస్ రాజ్ పుత్ లు కూడా సభ్యులుగా వ్యవహరించారు. గత నెల 27న ఈ ప్యానెల్ తమ నివేదికను కేంద్రానికి సమర్పించింది.
అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర మానవ వనురుల శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోడం మరీ ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో ఏం సాధించారన్న మీడియా ప్రశ్నలపై కూడా కేంద్రమంత్రి ఈ వివరాలను వెల్లడించకపోవడం ప్యానల్ చైర్మన్ కు లేఖ రాసే అవసరాన్ని తీసుకువచ్చినట్లుంది. స్కూలు వ్యవస్థపై ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నామని, పిల్లల వివరాలు సేకరించడం ప్రారంభించామని.. ఆవి లేని కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని మాత్రమే స్మృతి ఇరాని పేర్కొన్నారు. దీంతో తాము ఇచ్చిన నూతన జాతీయ విద్యా విధానం నివేదికను బయటపెట్టాలని అయన కోరారు. దీనిపై మానవ వనరుల శాఖ నుంచి ఇప్పటి వరకు స్పందించలేదు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more