తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు వందల కోట్ల రూపాయలతో ప్రతికలలో భారీ ప్రకటనలు ఇవ్వడం.. కోట్ల రూపాయలతో భారీ ఎత్తున నిర్వహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఒక వైపు రైతులు అన్నమో రామచంద్రా అంటూ అంగలారుస్తుంటే.. కేసీఆర్ మాత్రం వారు కష్టాలు పట్టని నీరో చక్రవర్తిలా సంబరాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా వివిధ పత్రికలలో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు ఇచ్చారని ఆయన అన్నారు.
బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పేద ప్రజలు, రైతులు బతకలేక, తమ కుటుంబాలను పోషించలేక బలంవంతంగా బలన్మారణాలకు పాల్పడుతుంటే.. నీరో చక్రవర్తిలా కేసీఆర్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ తీరు సిగ్గుచేటని దుమ్మెత్తి పోశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందడం మనమంతా చూశామని అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వడదెబ్బకు ప్రజలు పిట్టలా చనిపోతున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అయినా వాటిపై దృష్టి సారించని కేసీర్ సర్కార్.. సంబరాలకు మాత్రం వందల కోట్లను ఖర్చు చేస్తుందని దుయ్యబట్టారు. అంతకుముందు ఆయన తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదించినందుకు, తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకరం చేసినందుకు దిగ్విజయ్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చినా.. ఇప్పటికీ తెలంగాణ అమరవీరుల విషయంలో నాన్చివేత దోరణి అవలంభిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ అమరులను తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 1,100 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పటివరకు గుర్తించింది 300 మందినేనా? అని ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీలో చేర్పించాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్రస్లు ప్రభుత్వానికి దొరుకుతున్నాయి. కానీ.. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల అడ్రస్లు మాత్రం ఇంకా దొరకడం లేదా అంటూ తూర్పారబట్టారు. మాటల గారడీతో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు కలసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఇదెంతో కాలం సాగదని అన్నారు. కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు రిజర్వేషన్ హామీలన్నీ అటకెక్కాయన్నారు. వైఎస్సార్సీపీ అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజలకు అండగా పోరుబాట పడుతుందని అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more