కేంద్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్నా.. అన్నింటా ద్వంద ప్రమాణాలను అచరిస్తుందన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. అధికార పగ్గాలను చేపట్టగానే కేంద్రమంత్రులందరికీ సోషల్ మీడియాలో దేశ ప్రజలకు అనుసంధానం కావాలని చెప్పారు. అయితే అదే క్రమంలో అధికారులు పేస్ బుక్ లో ప్రజలతో టచ్ లు వుంటే.. వారి వ్యక్తిగత పేస్ బుక్ అకౌంట్లలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తే.. మాత్రం దానిని తప్పబడుతున్నారు. ప్రస్తుతం ఇదే తరహా వ్యవహరంతో ఓ అధికారి బదిలీ కూడా అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో వచ్చిన ఓ వార్త సంపాదకీయాన్ని లైక్ చేసి, షేర్ చేయడమే అ ఆదికారికి శాపంగా పరిణమించింది. అలా చేసినందుకు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారి అజయ్ సింగ్ గంగ్వార్ తాఖీదు అందుకున్నారు. ఫేస్బుక్ లో చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి అజయ్ గంగ్వార్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తాకీదులలో ప్రభుత్వం ఆదేశించింది. అంతకుముందే ఆయనపై చర్య తీసుకున్న ప్రభుత్వం.. బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వరించిన ఆయనపై బదిలీ వేటు వేసింది.
తదుపరి అదేశాలు అందేవరకు ఆయనను అక్కడి నుంచి సెక్రటేరియట్ కు బదిలీ చేసింది. అయితే మోడీకి వ్యతిరేకంగా ప్రజావిప్లవం రావాలని వున్న వ్యాసం తన టైమ్ లైన్ పై లేదని, దానిని కేవలం తాను లైక్ చేసి, షేర్ చేసుకున్నానని ఆయన చెప్పారు. కాగా అంతకుముందు మోదీని విమర్శిస్తూ, జవహర్ లాల్ నెహ్రును పొగుడుతూ ఆయన ఫేస్ బుక్ లో చేసిన కామెంట్స్ తోనే తనను మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం బదిలీ చేసిందని ఆయన అరోపించారు. ఇది పూర్తిగా భావవ్యక్తికరణ, వాఖ్ స్వతంత్ర్యానికి వ్యతిరేకమని, దీనిపై తాను న్యాయపోరాటం కూడా చేస్తానని గాంగ్వర్ అంటున్నారు. ఇక గంగ్వార్ ను వివరణ కోరడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ హరిస్తోందని విమర్శించింది. అజయ్ సింగ్ ను తిరిగి బర్వానీ కలెక్టర్ గా తిరిగి నియమించాలని డిమాండ్ చేసిం
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more