నాలుగో అభ్యర్థిత్వం ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అభ్యర్థిని నియమించినా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటూనే విజయసాయిరెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పోటీ నిలపడం వల్ల తమ పార్టీకి కలిగే నష్టం ఏం లేదని ధృఢనిశ్చయంతో ఉంది. అదే టైంలో జంపింగ్ జపాంగ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తమ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్, ప్రతాప్ కుమార్ లు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయం వెల్లడించారు. ‘‘ఆ ఆరుగురు మాతో టచ్ లో ఉన్నారు. వారంతా పశ్చాత్తాపం పడుతున్నారు. టీడీపీలోకి వెళ్లాక తమ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని చెబుతున్నారు. అక్కడ వారికి ప్రాధాన్యం ఉండకపోగా, అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారని’’ చెప్పారు. అంతేకాదు ఎలాగైనా సరే ఈ కుంపంలోంచి బయటపడి తిరిగి సొంత గూటికే చేరతామని వారు ఖరాకండిగా చెప్పారంట. ఒక్కో ఎమ్మెల్యేకి 40 కోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు బాబు యత్నిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
ఒకసారి పార్టీ మారటం తిరిగి సొంత గూటికి చేరటం జరిగిన సందర్భాలు అనేకం. అయితే అధికారంలో ఉన్న పార్టీని కాదని, తిరిగి ప్రతిపక్షంలో కూర్చోవాలని ఎవరూ కోరుకోరు కదా. రాజ్యసభ స్థానం కోసం ఇప్పటికే తెలుగుదేశం ఆకర్ష్ ను ప్రారంభించిందన్న పుకార్ల నేపథ్యంలో, సొంత గూటికి చేరతారనే వదంతులు సృష్టించడం ద్వారా నష్ట తీవ్రతను కాస్తలో కాస్త అయిన తగ్గించవచ్చన్న ప్రతిపక్షం ఆలోచన కాబోలు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more