తెలంగాణలో తొలిసారి కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 601 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కృష్ణా పుష్కరాలకు 825.16 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆర్ అండ్ బీ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా రహదారులు, స్నానఘట్టాలు, మంచినీటి నల్లాలు తదితర నిర్మాణాల కోసం 744.85 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అదనంగా మరో 80.31 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పుష్కరాల్లో భక్తులకు అందే సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణ లోని మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలలో కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. రెండు జిల్లాల్లో కట్టుదిట్టమయిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలతో పోలిస్తే కృష్ణా పుష్కర ప్రాంతాలు భిన్నమయినవి. తెలంగాణలో కృష్ణా నది ప్రవహించే చోట మొసళ్ళు తిరుగుతుంటాయని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార వర్గాలను ఆదేశించింది. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గత పుష్కరాల సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో 17 ఘాట్లు ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా మరో 35 ఘాట్లను నిర్మిస్తున్నారు. నల్లగొండ జిలాల్లో 11 ఘాట్లు ఉండగా మరో 23 ఘాట్లను నిర్మిస్తున్నారు. రెండు జిల్లాల్లో మొత్తం 86 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం 212 కోట్లు కేటాయించింది. కృష్ణా పుష్కరాలకు సుమారు 4కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని..దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more