తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం సహా కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరిలలో ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమిళనాడు మినహా రమారమి అన్ని రాష్ట్రాలలో నిజమైయ్యాయి, ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా అసోంలో బీజేపి అధికార పగ్గాలను అందుకునేందుకు అక్కడి ప్రజలు తీర్పును ఇవ్వగా, పశ్చిమ బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచాలకు మించి తృఫముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రెండో పర్యాయం పగ్గాలను అందుకునేందుకు సిద్దమైంది. కాగా ఇక్కడ పార్టీ పునాదులు బలంగా వున్న లెఫ్ట్ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వస్తున్నాయి.
కాగా కేరళలో కూడా సర్వే అంచనాలు ముమ్మాటికీ అంచనాలు వాస్తవాలయ్యాయి. కేరళ ప్రజలు గత కొన్ని పర్యాయాలుగా కొనసాగిస్తున్న సంప్రాదాయాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం ఓటర్లు ట్రెండు మార్చారు. అయితే ఎన్నికల సమయంలో అమ్మ అక్రమ అస్తుల కేసులో అరెస్టు.. విడుదల సందర్భంగా వచ్చిన సానుభూతిని అమ్మ అందిపుచ్చుకుంది. ఇక దీనికి తోడు డిఎండీకే ఎన్నికల బరిలో నిలవడం కూడా అమ్మకు కలసివచ్చిందని అయితే ఇక్కడ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటుకుని జయలలిత ఇక్కడ వరుసగా రెండో పర్యాయం అధికార పగ్గాలను అందుకోనుంది.
పుదుచ్చెరిలో రంగస్వామి కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ డీఎంకే పార్టీల కూలమి ముందంజలో వుంది. ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచానాలను ప్రకారమే పార్టీల బలాబలాలు వున్నాయి. కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలను అందుకునే దిశగా వుంది. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 10 గంటలకల్లా ఫలితాల ట్రెండ్స్ తెలియగా, మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెప్పారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more