తెలుగు మీడియాలో పెద్దన్నగా, తెలుగు రాజకీయాల్లో తెర వెనుక నుండి చక్రం తిప్పే వ్యక్తిగా పేరున్న రామోజీ రావుకు 2016కు గాను పద్మ విభూషన్ వరించింది. అయితే దీని మీద కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పెదవి విరిచారు. రామోజీరావుకు కొంత మంది దన్నుగా ఉన్నారు కాబట్టే వాళ్లు పద్మ అవార్డుకు రికమెండ్ చేశారు అని వార్తులు వచ్చాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా, మీడియా టైకూన్ గా పేరున్న రామోజీరావుకు పద్మ అవార్డు రావడానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఎవరూ కారణం కాదని తెలిసింది. అదేంటి మన వాళ్లు కాకుండా ఎవరు రికమెండ్ చేశారు అని అనుకుంటున్నారా..?
మీడియా ఛానల్స్ తో పాటుగా రకరకాల బిజినెస్ లు చేస్తున్న రామోజీరావుకు గుర్తింపునిస్తూ.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రికమెండ్ చేసినట్లు తెలిసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చిన ఓ దరఖాస్తు కోసం కేంద్రం నుండి వచ్చిన రిప్లై లో క్లీయర్ గా పేర్కొన్నారు. అసలు పద్మ అవార్డులను ఎలా ప్రకటిస్తారో కూడా ఆ రిప్లైలో ఉంది. మూడు రకాలుగా పద్మ అవార్డులకు అర్హులను గుర్తిస్తారు. అందులో మొదటిది.. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు రికమెండ్ చేసే వ్యక్తులను సెలక్ట్ చేస్తారు. రెండవది.. పొలిటికల్ పార్టీలు లేదా సమాజం మీద ప్రభావం చూపించే సెలబ్రెటీలు రెకమండ్ చేసిన వ్యక్తులు. ఇక మూడవది.. తమకు తాముగా రెకమండ్ చేసేకోవడం ద్వారా అంటే బాబూ నేను ఇంతలా సేవ చేశాను కాబట్టి పద్మ అవార్డు ఇవ్వండి అని కోరడం అన్నట్లు. ఇందులో ఎక్కడా కూడా ప్రజాభిప్రాయాన్ని కోరడం ఉండదు.
-Abhinavachary
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more