మధుర బీజేపీ ఎంపీ, సినీనటి హేమమాలిని ఈ మధ్యకాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. మధుర నుంచి వెళ్తు కారు ప్రమాదానికి గురై ఓ చిన్నారి మృత్యువుకు కారణమైందన్న అభియోగాలను ఎదుర్కెన్న అమె.. ఆ విషయంలో అమె పరిహారం కూడా ఇస్తారని అమె కూతుళ్లు ప్రకటన చేసిన తరువాత.. కోలుకున్న తరువాత అమె చిన్నారి తండ్రే ప్రమాదానికి కారణమయ్యాడని అమె అరోపించడంతో అమెపై అప్పట్లో నెట్ జనులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసారు. ఆ తరువాత జరిగిన మరో ప్రమాదంలో అమె తృటిలో తప్పించుకున్నారు.
వీటిని పక్కన బెడితే ఆ మథ్య బీజేపి ఎంపీగా అమె నియోజకవర్గ ప్రజలకు సమాజహిత కార్యక్రమాలను చేయడంతో పాటు భారతీయ కళకు సజీవరూపంగా వున్నందున్న అమె మహారాష్ట్రలోని దేవేంద్ర ఫాడ్నావిస్ ప్రభుత్వానికి తన న్యాట్య మందిరం కోసం భూమిని కేటాయించాలని కోరారు. అయితే ఆ వినతిపై కూడా హుటాహుటిన స్పందించిన పడ్నావిస్ ప్రభుత్వం వెంటనే అమె న్యాట కళామందిరానికి స్థలం కేటాయించింది. అది కూడా అత్యంత చౌకధరకు కోట్ల రూపాయల భూమిని దారదత్తం చేసింది. దీంతో కూడా హేమామాలని వార్తల్లో నిలిచారు.
కాగా తాజాగా హేమామాలిని మరోమారు వార్తల్లో నిలిచారు. అమె తన సోంత నియోజకవర్గంలోనూ ప్రతికూల వాతావరణం ఎదుర్కోంటూ వార్తల్లోకెక్కారు. హేమమాలిని తనను దూషించారని గ్రామ ప్రధాన్( సర్పంచ్) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాన్సిబట్ పర్యటనకు హేమమాలిన వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని మాంట్ మూలా గ్రామ ప్రధాన్ భగవతీ దేవి భర్త భగవాన్ సింగ్ ఆరోపించాడు. అంతటితో అగని అమె తన భార్య ఎలా గెలించిందో కూడా తెలుసునంటూ వ్యాఖ్యలు చేశారని పేర్కోన్నాడు.
అవమానభారంతో కుంగిపోయిన భగత్ సింగ్ ను స్థానికులు అస్పత్రిలో చేర్పించారు. కాగా అయన పరిస్థితి ప్రస్తుతం కోలుకుందని వైద్యులు తెలిపారు. హేమమాలిని తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆమె దిష్టిబొమ్మను దహనంచేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామంలో చెట్లను ఎందుకు నరికివేశారని అమె ప్రశ్నించి విషయమై తాను సమాధానం చప్పానని, హోరున విస్తున్న గాలులకు చెట్లు విరిగిపోయాయని అందుకనే వాటిని నరివేశామని చెబుతుండగానే అమె తిట్లదండకం అందుకున్నారని సింగ్ అరోపించారు.
భగవాన్ సింగ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడానికి మీనమేషాలు లెక్కబెడుతున్నారు. అధికారంలో వున్నవాళ్లు తప్పులు చేసినా.. వారిపై కేసులు నమోదు కావా..? అదే ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్పు చేస్తే.. వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసే బీజేపి.. తమ నేతలను మాత్రం వాటి నుంచి ఎందుకు మినహాయింపు ఇస్తుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హేమమాలినిపై తమకు పిర్యాదు అందిందని, అయితే ఎప్ఐఆర్ నమోదు చేయలేదని, విచారణ తరువాత కేసు నమోదు చేస్తామని డిప్యూటీ ఎస్ పీ సంజయ్ కుమార్ తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more