జార్ఖండ్లో గిరిజన వాసుల్లో వున్న నమ్మకం వట్టి భూటకమని తేలింది. అయితే అదే సమయంలో విషనాగుల కన్నా మనిషే అత్యంత విషపూరితుడని కూడా తేటతెల్లమైంది. ఓ గ్రామస్తుడిని విషపూరితమైన పాము కాటేసింది. దీంతో భాదితుడు పామును పట్టుకుని కొరికేశాడు. ఇదే అక్కడి వాసుల నమ్మకం. కాటేసిన పామును పట్టుకుని కొరికితే ఆ పాము విషం తమనేమి చేయదని వాళ్లు నమ్ముతుంటారు. అతను పామును కొరికగానే కేవలం గంట వ్యవధిలో పాము చనిపోయింది, కాగా బాధితుడు కూడా ఆ తర్వాత 12 గంటలకు పాము విషం వల్ల అతని శరీరంలో వ్యాపించడంతో అతడు కూడా చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వేళ పాము బుస్సలు వినిపించడంతో 50 ఏళ్ల రాంథూ ఒరాన్ నిద్రలోంచి మేల్కొన్నారు. పొరుగు ఇంట్లోకి పాము దూరడంతో ఆ ఇంట్లోని వారు సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఒరాన్ వెంటనే వాళ్ల ఇంట్లోకి వెళ్లి పామును తన చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అంతలోనే అతడు పామును తన పళ్లతో కొరికేశాడు. దాంతో అది చనిపోయింది. అయితే, ఇంట్లోకి దూరిన పామును పట్టుకునే క్రమంలో అది ఆయనను కూడా కాటేసిందని ఆ తర్వాత గ్రామస్తులు, బంధువులు గుర్తించారు.
మెల్లగా విషం పాకుతుండటంతో చికిత్స కోసం ఆయనను లాతేహార్ జిల్లాలోని కార్మెల్ ఆశా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు ప్రత్యేక చికిత్స అందించే ఈ ఆస్పత్రిలో ఆయన 12 గంటల తర్వాత మరణించాడు. జార్ఖండ్లో పాముల్ని కొరకడం అసాధారణమేమీ కాదు. గతంలో ఓ గిరిజనుడిని పాము కాటేయగా.. అక్కడి ప్రజలలో వున్న నమ్మకం మేరకు బాధితుడు దానిని తినేశాడు. అయితే అతని విషయంలో ఫలించిన ఈ స్ట్రాటజీ.. ఇతడి విషయంలో మాత్రం విఫలమైంది. అందుకనే పాముకాటు వేయగానే అంటీ వెనమ్ ఇంజక్షన్ తీసుకోవాలన్న ప్రచారం అక్కడి ప్రజల్లో ప్రచారం చేయాలి. లేని పక్షంలో పాము కాట్లతో అక్కడి గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలయని పరిస్థితి ఏర్పడుతుంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more