తాము కేంద్రంలో అధికారంలోకి చ్చిన నాటి నుంచి అవినీతిని రూపుమాపామని చెప్పుకుంటున్న బీజేపి.. ఉత్తరాఖాండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగోట్టి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అక్రమాల బాటను పట్టక తప్పడం లేదు. అది ఎంతలా అంటే.. ఒక్కో ఎమ్మెల్యేకు యాభై కోట్ల రూపాయలను ఆపర్ చేయడంతో పాటు.. రానున్న ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కూడా ఇచ్చేందుకు హామిలు కూడా ఇస్తున్నారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేందుకు కారణంగా చెప్పిన అవినీతికే బీజేపి పాల్పడతుంది.
సాక్షాత్తు కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపిస్తున్నాడని, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయని అరోపించారు. అందుకనే అక్కడ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశామని చెప్పారు. అయితే అధారాలు లేకుండా అదే ఎమ్మెల్యేలతో బీజేపి సాగిస్తున్న బేరసారాలపై వెంకయ్య ఎందుకు నోరు విప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రపతి పాలన విధింపుపై ఉత్తరాఖండ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు కేంద్రానికి, రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ లకు మొట్టికాయలు వేసింది.
ఈ నెల 29న ఉత్తరాఖండ్ లో బలనిరూపణ చేసుకోవాలని హరీష్ రావత్ ప్రభుత్వానికి న్యాయస్థానం అవకాశాన్ని అందించింది. దీంతో బీజేపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దెబ్బతీసి తమ మార్కు రాజకీయానికి తెరలేపాలని యోచిస్తున్న సమయంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపి అఫర్ ను బహిర్గతం చేశారు. తమకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
'50 కోట్ల రూపాయల వరకు డబ్బు ఇస్తామని బీజేపీ నాయకులు ప్రలోభపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు' అంటూ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో చెప్పారు. వీరిద్దరితో పాటు డిప్యూటీ స్పీకర్ అనుసూయ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. బీజేపీ నాయకుడు సత్పాల్ మహారాజ్తో ఉన్న సంబంధాలు వ్యక్తిగతమైనవని, రాజకీయపరమైనవి కావని భండారి, జీత్ రామ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు 2.5 కోట్ల నుంచి బేరం మొదలుపెట్టి 50 కోట్ల రూపాయలకు పెంచారని, తమను ఎవరూ కొనలేరని భండారి చెప్పారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more