తెలంగాణలో మంత్రి పదవుల తారుమారు మీద చర్చసాగుతోంది. కొంత మంది మంత్రులకు శాఖలు మార్చే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దగ్గర దగ్గర ఉన్న శాఖలు ఒకే మంత్రి చేతిలో ఉంటే పరిపాలన మరింత బాగా జరుగుతుందని కేసీఆర్ ఆలోచించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరైన వాణిజ్య పన్నుల శాఖను సీఎం కేసీఆర్ తన వద్దనే ఉంచుకోవచ్చని తెలుస్తోంది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్న ఆ శాఖ మంత్రి కేటీఆర్ కు ఇటీవలే పురపాలకశాఖను అప్పగించారు.
నగరాలు, పట్టాణాల అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమైనవి. కనుక పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖలు ఒకే మంత్రి దగ్గర ఉంటే మరింత మెరుగైన ఫలితాలుంటాయని సర్కారు పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగితే మంత్రి జూపల్లి వద్దనున్న పరిశ్రమలశాఖను కేటీఆర్కు అప్పగించవచ్చు. అలాగే మంత్రి కేటీఆర్ వద్ద ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను జూపల్లి కృష్ణారావుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఏ పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో మిషన్ భగీరథను పంచాయతీరాజ్ శాఖ నుంచి విడదీసి తన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు తన చేతిలో ఉంటేనే అధికారులను దౌడు తీయించవచ్చునన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది.
సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాలు, కొత్త దవాఖానల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వీటన్నింటికీ కావాల్సిన నిధులు వాణిజ్య పన్నుల ద్వారానే సమకూర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి, పకడ్బందీగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడానికి, పన్ను వసూళ్లను నూటికి నూరు శాతం రాబట్టే ఆలోచనతో వాణిజ్య పన్నుల శాఖను చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ శాఖను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూస్తున్నారు. తలసానికి సినిమాటోగ్రఫీతో పాటు బీసీ సంక్షేమశాఖ లేదా మరో కీలకమైన శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా కొన్ని శాఖలను మార్చడం ద్వారా పాలనలో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more