విదేశాలకు నల్లధనాన్ని తరలించిన 500 మంది భారతీయ పన్ను ఎగవేతదారుల జాబితాలో వున్నారని అభియోగాలను ఎదుర్కోంటున్నబాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే విషయంలో కేంద్రం అచితూచి వ్యవహరిస్తుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలుస్తుంది. ఇప్పుడిదే విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు హాట్ టాపిక్ గా మార్చేశాయి.
దేశ కీర్తిప్రతిష్టలను పెంచడంతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రూపొందించిన ప్రచార కార్యక్రమమే ఇన్ క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్(అతుల్యభారత్). ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజం, దేశవాసులంతా ఇండియాస్ మెగాస్టార్ అని పిలుచుకునే అమితాబ్ బచ్చన్ పేరును బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. దానికి ఆయన అంగీకరించారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల పనామా లీకేజీ వివాదంలో ఆయనతోపాటు కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్లు బయటకురావడంతో దీనిపై కేంద్రం పునరాలోచనలో పడిందని తెలుస్తుంది.
కాగా ఈ అంశంపై అమితాబ్ స్పందిస్తూ... అసలు తనను కేంద్రం ఇంతవరకు అతుల్యభారతం కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండమని అధికారికంగా ఆహ్వానించనేలేదన్నారు. ఇదంతా మీడియా ప్రచారమేనని స్పష్టం చేసారు. మీడియాలో తన పేరుపై దుమారం రేగడంతోనే తాను ఈ విషయమై స్పందిస్తున్నానని చెప్పారు, పనామా పేపర్ల అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ లీకేజీలో తన పేరు, తన కోడలి పేరు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. అయినా ఇప్పటికీ మీడియా నుండి పలు రకాల ప్రశ్నాస్త్రాలు తనకు లెక్కలేనన్ని వస్తున్నాయన్నారు. ఈ ప్రశ్నలను తనను కాకుండా కేంద్రప్రభుత్వాన్నే అడగాలని సూచించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more