దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారన్న కేసులో మరో కొత్త ట్విస్టు చేటుచేసుకుంది, పూరి జగన్నాథ్ తమపై తప్పడు కేసు పెట్టారని, ఆయనపై తాము అసలు దాడే జరపలేదని లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత సి.కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి అసలు తాము వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.
నిర్మాత తరువాత దర్శకుడినే తాము డబ్బులు అడుగుతామని తెలుసుకున్న పూరి జగన్నాథ్.. ఓ సినిమా కథను తనంతట తాను రాసుకుని తమపై ఆరు సెక్షన్ల కింద ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని అరోపించారు, పూరి జగన్నాథ్ కు బాగా తెలిసిన ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ విషయంలో ఆయనకు సహాయసహకారాలను అందంచారని వారు అరోపించారు. అయితే కేసు నమోదు కావడం పెద్ద విషయం కాదని, దాని దర్యాప్తు కూడా చేయాల్సి వుంటుందని, ఈ క్రమంలో దర్యాప్తులో అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయని చెప్పారు.
పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లు అసలు రోజున హైదరాబాద్ లోనే లేరని వెల్లడించారు. పోలీసు అధికారులు కావాలంటే పూరి జగన్నాథ్ ఇంట్లో వున్న సిసి కెమెరాలను పరిశీలిస్తే నిజానిజాలు స్పష్టం అవుతాయని చెప్పారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంటున్నామని అన్నారు.
రజనీకాంత్, సూర్య, మహేశ్ బాబు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పడు డబ్బులు వెనక్కు తిరిగిచ్చేసిన విషయాలను వారు గుర్తు చేశారు. 'అఖిల్' విడుదలైన తరువాత ఆ సినిమాపై ప్లాప్ టాక్ రాగానే రెండో రోజునే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా యిచ్చారని వెల్లడించారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సినిమా నిర్మాత, దర్శకుల తరువాత ఆ సినిమాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే వాళ్లము తామేనంటూ చెప్పుకోచ్చారు, సినిమా తీయడంతో వారి పని ముగిస్తే.. అప్పటి నుంచే తమ పని ప్రారంభం అవుతుందని, తమ సంక్షేమం కూడా నిర్మాత, దర్శకులు అలోచించాలన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more