వంట వండాలంటే మంట పెట్టాల్సిందే. అలా వంట కోసం ఓ చోట మాత్రం స్టవ్ వెలిగించినా లేదంటే కట్టెల పొయ్యిని అంటించినా భారీ శిక్షలు విధిస్తున్నారు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. వంట కోసం స్టవ్ వెలిగిస్తే అక్కడ అదో పెద్ద సీరియస్ ఇష్యూ. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బీహార్ రాష్ట్రంలో. చంపారన్ జిల్లాలో వంట కోసం స్టవ్ వెలిగిస్తే భారీ శిక్షలు విధిస్తారు. ఇందుకు ప్రత్యేకమయిన కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ ఎండలు బాగా మండిపోతున్నాయి. గత పది రోజుల నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల వేడిమికి తోడు కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్లు వెలిగించడం వల్ల వేడితో మంటలు చెలరేగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఉదయం 9 గంటల తర్వాత కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌవ్లు వెలిగించొద్దని ఆదేశాలిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒకవేళ ఆదేశాలను కాదని. ఉదయం 9 గంటల తర్వాత స్టౌవ్ వెలిగించిన వారికి చెప్పు దెబ్బతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. చంపారన్ జిల్లాలోని లక్ష్మీపూర్, పాటిలార్, రత్వాల్ వంటి చోట్లు ఉదయం 10 గంటల కంటే ముందే వంట చేసుకుంటున్నారు. కొంతమంది కిరోసిన్ దీపాలను కూడా వెలిగించడం లేదు. టార్చిలైట్లు, రీచార్జ్ విద్యుత్ దీపాలను మాత్రమే వినియోగిస్తున్నారు.కొందరు అగ్నిప్రమాదాలకు భయపడి వంటలు కూడా చేసుకోవడం లేదు. ఎండాకాలం అంతా ఇలాంటి నిబంధనలే అమలులో ఉంటాయంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more