మాజీ విశ్వ సుందరి, ప్రముఖ సినీనటి ఐశ్వర్యారాయ్ నాలుగు పదుల వయస్సులోకి చేరినా.. అమె అందం కించిత్ కూడా చెదరలేదు. అందుకే కాబోలు ఓ చారిటీ కార్యక్రమానికి హాజరైన అమెకు ఓ జర్నలిస్ట్ షాక్ ఇచ్చాడు. కరాచలనం చేసేందుకు ముందుకు వెళ్లిన ఐశ్వరకు ఏకంగా కరాచుంబనం చేసి అందరినీ అశ్చర్యంలో ముంచెత్తాడు. బ్రిటెన్ యువరాజు విలియమ్, అతని సతీమణి కేట్ మిడిల్టన్ తో పాటు తొలిసారిగా భారత్ పర్యటను వచ్చిన సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
భారత్లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది, ముంబై లోని తాజ్ మహాల్ ఫ్యాలెస్ హోటల్ లో గాలా డిన్నర్ నిర్వహించారు, ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో ఒకరు ఐశ్వర్య రాయ్. ఈ చారీటీకి హాజరైన వారిలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా వున్నారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ లో జర్నలిస్టు ముద్ద పెట్టినా.. దానిని కేవలం స్పోర్టివ్ గా తీసుకుని తన విశాల దృక్పథాన్ని చాటుకుంది ఐశ్వర్య.
ఈ కార్యక్రమంలో పాల్గోన్న సెలబ్రీటీలలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ ఐష్ని విష్ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్ హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్ ఐష్ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు.
అయితే.. ఈ విషయాన్ని ఐశ్వర్యారాయ్ సీరియస్ గా తీసుకోలేదు. స్పోర్టివ్ గా తీసుకుని అందరితోపాటు నవ్వేసింది. ఈ ఘటనతో ఐశ్వర తన హుందాతనాన్ని చాటుకుందని, లేని పక్షంలో పెద్ద రభసే జరిగేదని జర్నలిస్టులే చర్చించుకున్నారు. ఈ మద్యకాలంలో బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు జర్నలిస్టులు చేస్తున్న వెకిలి చేష్టలతో సెలబ్రిటీలు కాస్త తమ చేతులకు పనిచెబుతున్నారు, ఇలాంటి ఘటనలు అనేకం ఈ మద్య కాలంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నా.. జర్నలిస్టులలో మాత్రం మార్పు రావడం లేదు, పది మందిలో పరువు తీయడానికి ముందు జర్నలిస్టులు తమ చేసే పనులను, వేసే ప్రశ్నలను పునరాలోచించుకోవాలన్న సూచనలు కూడా వినబడుతున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more