రోహిత్ వేముల సోదరుడు రాజాకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. కారుణ్య నియామకం కింద గ్రేడ్ 4 (నాలుగోతరగతి) ఉద్యోగంలో రాజాను అపాయింట్ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) ఉత్తర్వులు జారీచేసింది. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన వేముల రాజాకు నాలుగో తరగతి ఉద్యోగం కల్పించడం అతణ్ని అవమానించడమేనని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇది కేవలం రాజకీయ పార్టీల కంటితుడుపు చర్యని విమర్శిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన వ్యక్తికి క్లర్క్ పోస్టును ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన రాజా 72.8 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం పలు రాజకీయపార్టీలు రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకుంటాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఓ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమను కలిసినప్పుడు ఉద్యోగం కల్పించాలని విన్నవించారు. ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ సర్కార్ ఏప్రిల్ 4న నియామక ఉత్తర్వులను వెలువరించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇవ్వజూపిన గ్రేడ్ 4 ఉద్యోగంలో చేరబోయేదీ, లేనిదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వేముల రాజా మీడియాకు చెప్పారు. 'నేను ఏదైనా విదేశీ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేయాలని అన్నయ్య కోరుకునేవాడు. అతని కలల్ని నిజంచేయడమే నాముందున్న కర్తవ్యం'అని తన ఆకాంక్షను వెల్లడించారు రాజా.
అటు నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్(నెట్)లోనూ అర్హత సాధించిన రాజాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతలుండగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఇలా నాలుగోతరగతి ఉద్యోగాన్ని ఆఫర్ చేయడం అతణ్ని అవమానించడమేనని రోహిత్ స్నేహితులు, హెచ్ సీయూ అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత గుమ్మిడి ప్రభాకర్ అన్నారు. పలు సంఘాలు కూడా కేజ్రీ తీరును తప్పుపట్టారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కింద గ్రూప్ సి, గ్రూప్ డీ తప్ప మరే ఇతర ఉద్యోగాలు కల్పించలేమని, అందుకే విద్యార్హతల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాజాకు గ్రేడ్ 4 ఉద్యోగం కల్పించామని ఢిల్లీ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more