మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను పరాభవం ఎదురైంది. సుమారుగా 20 ఏళ్ల కిందట దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దేవెగౌడ.. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళ్లలన్నా అడ్డుగోడలు అంటూ లేకుండా స్వేచ్చగా వెళ్తుంటారు. అయితే అలాంటి స్వేచ్ఛకు తన రాష్ట్రంలోనే గవర్నర్ వి.ఆర్.వాజూభాయివాలా కారణంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో లోకాయుక్తను నిర్వీర్యం చేసేందుకు ప్రవేశపెట్టిన అవినీతి నిరోదక శాఖను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ వల్లాకు మెమొరండం సమర్పించేందుకు వెళ్లగా రాజ్ భవన్ లోనికి దేవెగౌడ్ ను అనమతించకుండా అవమానించారు.
దేవెగౌడ సమర్పిస్తున్న మెమోరాండంను తీసుకోకుండా తిరస్కరించి గవర్నర్ ఆయనను అవమానించారు. రాష్ట్రంలో ఎసిబి ఏర్పాటును వ్యతిరేకిస్తూ దేవెగౌడ తన అనుచరులతో కలిసి ఫ్రీడం పార్కు నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పలువురు జెడిఎస్ శాసన సభ్యులు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. గవర్నర్ను తాను కలుసుకోవలసిన అవసరాన్ని ఒక్క రోజు ముందగానే రాజ్భవన్కు సమాచారం అందించానని గౌడ పేర్కొన్నారు. మధ్యాహ్నం 2-3 గంటల మధ్య గవర్నర్ను కలుసుకునేందుకు రాజ్భవన్ వర్గాలు అనుమతిచ్చాయి.
ఆ సమయానికి గౌడ తన సహచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. కాని అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఆ తరువాత కొంతసేపటికి అనుమతించారు. దాదాపు గంటన్నర సేపు గౌడ లోపలే వేచి ఉన్నారు. అయినప్పటికి గౌడను కలుసుకునేందుకు గవర్నర్ రాలేదు. గవర్నర్ చర్యతో విసుగుపుట్టిన గౌడ రాజ్భవన్ నుంచి బయటకు వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తన తనయుడు కుమారస్వామి, జనతాదళ్ పార్టీ నేతలతో కలసి రాజ్ భవన్ బయటకు వచ్చిన ఆయన గవర్నర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
గవర్నర్ను కలుసుకునేందుకు ఇక ఎన్నడూ రాజ్భవన్కు రానని, ప్రజా సమస్యలను కోర్టు ముంగిటకు తీసుకువెళ్తానని విలేకరులకు తెలిపారు. కన్నడిగుల పట్ల గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేవలం నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అనేక మంది రాజ్ భవన్ లకు విచ్చేస్తున్నారని అరోపించారు. వయస్సు మీదపడటం కారణంగానే గవర్నర్ నిద్రకు పూనుకున్నాడని, అయితే ఆయనది తనంత వయస్సు కాదని కూడా తెలుసుకోవాలన్నారు. ఈ గవర్నర్ల తీరు బ్రిటీష్ కాలంలోని కొలోనియం బానిసత్వ వ్యవస్థను గుర్తు చేస్తుందన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more