సరిగ్గా ఐదు మాసాల క్రితం జరిగిన ఉగ్రదాడి ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పారిస్ లో మారోమారు భారీ విస్పోటనం సంభవించింది. అయితే ఈ విస్పోటనం ఉగ్రవాదుల చర్య కాదని, కేవలం గ్యాస్ లీక్ కావడంతోనే జరిగిందని ప్రత్యక్షసాక్షలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. సెంట్రల్ పారిస్లోని ఆరవ జిల్లాలో నివాస సముదాయాల మద్య ఈ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలా జరిగిందన్న విషయం తెలియకపోవడంతో పారిస్ వాసుల్లు ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు.
ఈ పెలుడులో పారిస్ లోనే అత్యంత ఎత్తైన భవనం ఆకాశహార్య్మం టూర్ మాంట్ పర్నాస్పీ లో కొంత భాగం దెబ్బతినింది. ఘటనాస్థలి ప్రాంతంలో నివసిస్తున్న వారిని పోలీసులు హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం సంభవించగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు భవనంలో వ్యాపించిన మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు.
ప్రాన్సు పోరుగుదేశం బెల్జియం రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగిన జంట పేలుళ్ల ఆనంతరం మెట్రో సబ్ స్టేషన్ లో పేలుళ్లతో సుమారు 36 మందిని ఉగ్రదాడి మట్టుబెట్టిన ఘటన నుంచి అక్కడ హై అలెర్ట్ ప్రకటించారు. సరిగ్గా ఐదు నెలల క్రితం నవంబర్ లో జరిగిన నరమేథంలో 136 మంది ప్రజలు అమరులైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా పారిస్ వాసుల కళ్ల ఎదుట మళ్లీ ఉగ్రభూతం కనిపించినట్లయ్యింది. అయితే ఘటనకు గల కారణాలను మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది,
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more