విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం రాసలీలకు వేదికైంది. ఆలయ సత్రంలో ఓ మహిళతో ఆలయ ఉద్యోగులు వెలగబెడుతున్న రాసలీలలు బయటపడ్డాయి. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. అత్యంత ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఇటీవలే టీటీడీ దత్తత తీసుకుంది. దీనిపై వేగంగా స్పందించిన టీటీడీ అధికారులు... ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.
టీటీడీ ఉద్యోగిగా చేరిన వెంకటరమణమూర్తితోపాటు మరో ఇద్దరు ఉద్యోగులు రాత్రంతా మద్యం సేవించి సరససల్లాపాల్లో మునిగితేలారు. మూర్తి ఆ మహిళతో రాసలీలలు జరుపుతున్న సమయంలో మిగతావారు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఆయనను ఇరికించేందుకు వారు ఈ పని చేసినట్టుగా భావిస్తున్నారు. బుధవారం రాత్రి గొడవేమైనా జరిగిందో ఏమో మూర్తి చెవిపై గాయం కనిపిస్తోంది. సిబ్బంది తీసుకొచ్చిన మహిళే ఆయనను గాయపరిచినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more