అంతా దేవుడే చేశాడు అని మనం అప్పుడప్పుడు మట్లాడుతుంటాం. కొంత మంది అయితే మన చేతుల్లో ఏముంది అంతా దేవుడు చేసిందే మనం కేవలం నిమిత్తమాత్రులం అంటుంటారు. అయితే తాజగా కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 21 మంది మృతి చెందగా, 80 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ నిర్మాణాన్ని చేపడుతున్న ఐవీఆర్సీఎల్ సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు విన్న అందరూ షాక్ కు గురయ్యారు. అంత మంది చావుకు కారణం ఆ సంస్థ నిర్లక్షమే అని అందరూ అంటుంటే ఆ కంపెనీ ప్రతినిధులు మాత్రం వేరే కారణం అంటున్నారు.
తమ సంస్థ గత 27 ఏళ్లుగా ఎన్నో వంతెనలను నిర్మించామని,ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశామని కానీ ఇటువంటి ప్రమాదం ఎన్నడూ చోటుచేసుకోలేదన్నారు. ఘటనాస్థలంలో ఉన్న తమ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు కనిపించటం లేదని, వారికోసం వెతుకుతున్నామన్నారు. ప్రమాదం వెనక నాణ్యత, సాంకేతికపరమైన తప్పిదాలేమీ లేవని.. ఇప్పటికే 70 శాతం వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా ఈ ఘటన ఎలా జరిగింది అని ప్రశ్నిస్తే మాత్రం యాక్ట్ ఆఫ్ గాడ్ అని అనడం తీవ్ర దుమారానికి తెర తీసింది. మొత్తం 60 పిల్లర్లు నిర్మించామని, 59 పిల్లర్లకు ఏ మెటీరియల్ అయితే వాడామో దానికి కూడా వాడినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మొత్తానికి ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ మరి కంపెనీకి కూడా ఎలా పనిచేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more