తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు ఊరట లభించింది. ఈ మేరకు క్రితం రోజున హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక ప్రతి శుక్రవారం కోర్టు జరయ్యే మీరు నాయకులు, మీరు చెప్పేది మేము వినాలి అనే టీడీపీ నేతల విమర్శలకు ఇకపై బ్రేక్ పడనుంది. వివరాల్లోకెళితే... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు వేనకేసుకున్నారన్న ఆభియోగాలపై దర్యాప్తు చేసిన సీబీఐ జగన్ పై 11 కేసులు పెట్టి.. అందుకు సంబంధించి చార్జిషీట్లను కూడా కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లకు సంబందించిన విచారణ ప్రస్తుతం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యే కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతుండగా వాటి విచారణకు జగన్ తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తాను అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ తరపున ఆయన న్యాయవాది మహంతీ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో... కేసు విచారణలో భాగంగా ప్రతీ వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ జగన్ కు ఊరటనిస్తూ న్యాయస్థానం మధ్యతంత ఉత్తర్వులను జారీ చేసింది. జగన్ తో పాటుగా దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డీలకు కూడా వ్యక్తిగత హాజరు నుంచి న్యాయస్థానం మినహాయింపు లభించింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more