కోలకతా లోని వివేకానంద ఫ్లై ఓవర్ కూలిన ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తన దాడిని ఎక్కుపెట్టింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు ఈ ఘటనే తార్కాణమని బీజేపీ మండిపడింది పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాష్ విజయ వార్గీయ ఫ్లై ఓవర్ కూలిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం అవినీతి పాలనకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన ట్విట్ చేశారు. కైలాష్ విజయ వార్గీయ.. తన వరుస ట్విట్లలో మమత పై విరుచుకుపడ్డారు.
ఈ సంఘటనపై మమతపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె అవినీతి వల్ల అమాయక ప్రజలను బలి తీసుకుందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మృతులకు సంతాపం తెలిపిన కైలాష్ విజయ వార్గీయ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఈ వార్త తెలియగానే తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్న మమతా బెనర్జీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు, క్షతగాత్రులను పరామర్శించారు, ఎవరూ అధైర్యపడవద్దని అందరి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మమతాబెనర్జీ చెప్పారు.
అటు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోవడం బాధ గలిగించిందని బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విట్ చేశారు. సహాయక చర్యల్లో సహకరించాల్సిందిగా పార్టీ రాష్ట శాఖ పార్టీకి ఆదేశాలు జారీచేసినట్టు ఆయన తెలిపారు.కాగా ఉత్తర కోల్కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more